వైమానిక దాడులు, 17 మంది ఉగ్రవాదులు అంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదుల అంతం చూసింది. బస్సులో కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద వైమానికదాడులు జరిపింది. ఈ దాడులలో అనేక మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని పాకిస్థాన్ సైనిక వర్గాలు అంటున్నాయి.
తూర్పు వజీరిస్థాన్ లోని గిరిజన ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు పాక్ రక్షణ వర్గాలు గుర్తించాయి. శుక్రవారం షవాల్ జిల్లాలోని మూడు ఉగ్రవాద స్థావరాల మీద పాక్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులలో 17 మంది ఉగ్రవాదులు మరణించారు.

17 మంది మరణించగా అనేక మంది ఉగ్రవాదులు గాయపడ్డారని పాక్ రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు చెందిన నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం చేశారు. షవాల్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని ఉగ్రవాదుల స్థావరాలను గుర్తిస్తున్నారు.
జర్బ్-ఇ-అజ్బ్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా తుడిచి పెట్టాలని పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఆ ఉగ్రవాద సంస్థ స్థావరాలను గుర్తిస్తున్నారు. కారాచీలో బస్సు పై ఉగ్రవాదులు దాడులు చేసి అనేక మంది ప్రాణాలు తీసిన నేపద్యంలోనే ఈ వైమానిక దాడులు జరిగాయని తెలిసింది.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications