కార్తి చిదంబరంపై ఈడీ ఛార్జీషీటు, మరో నలుగురి పేర్లు చేర్చిన దర్యాఫ్తు సంస్థ
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్తి చిదంబరం, తదితరులపై ఛార్జీషీటు దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వారిపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఈ ఛార్జీషీట్ దాఖలు చేసింది.
న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద కార్తి చిదంబరంతో పాటు మరో నలుగురు పేర్లను ఈడీ చేర్చింది. పలుమార్లు మాజీ కేంద్రమంత్రి చిదంబరం పేరు చేర్చినా, అతడిని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు.

దీనికి అనుబంధ ఛార్జీషీటును కూడా దాఖలు చేస్తానని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది. 2జీ స్పెక్ట్రమ్ స్కాం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎయిర్ సెల్- మ్యాక్సిస్ మనీ లాండరింగ్ బయటపడింది. దాంతో 2010, 2011లో కార్తి చిదంబరంపై సీబీఐ, ఈడీ ఫైల్ చేసిన కేసులకు సంబంధించి అతడిని అరెస్టు చేయకుండా కోర్టు జులై 10 వరకు తాత్కాలిక రక్షణను పొడిగించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications