ఆకాశ్-శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజులు అంటే? బ్యాచిలర్ పార్టీ మాత్రం స్విస్లో
ముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9వ తేదీన శ్లోకా మెహతాతో జరగనుంది. రస్సెల్ మెహతా, మోనా మెహతాల కూతురు శ్లోక. ఈ పెళ్లి ముంబైలో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు ఉంటాయి. 2018లో ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి ఆనంద్ పిరమిల్తో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు ఆకాశ్ పెళ్లి కోసం సిద్ధమవుతున్నారు.

ఆకాశ్ - శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అంటే?
ఆకాశ్ అంబానీ, శ్లోకల నిశ్చితార్థం 2018లో జరిగింది. మార్చి 9, 2019 శనివారం నాడు పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుక ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లో జరగనున్నాయి. మంగల్ భరత్ ముంబైలో శనివారం ఉదయం గం.3.30కు ఉంటుంది. ప్రముఖులు పెళ్లికి హాజరవుతారు. అకాశ్, శ్లోకల పెళ్లి సాయంత్రం 7.30లకు జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ మార్చి 10వ తేదీన (ఆదివారం) జరగనున్నాయి. ఇది కూడా జియో వరల్డ్ సెంటర్లో ఉంటుంది. ఆ తర్వాత అదే వేదికలో మార్చి 11న వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.

బ్యాచిలర్ పార్టీ
ఆకాశ్ అంబానీ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆకాశ్కు వజ్రాల వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాతో గతేడాది వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి కానుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ బ్యాచిలర్ పార్టీని స్విట్జర్లాండ్ల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి 25 వరకు అక్కడే బ్యాచిలర్ పార్టీ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది.

మూడు రోజుల పాటు బ్యాచిలర్ పార్టీ
బ్యాచిలర్ పార్టీ కోసం ఆకాశ్ స్నేహితులైన బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ స్విస్కు ప్రయాణం కానున్నారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భారత్ నుంచి రెండు ప్రత్యేక విమానాలు స్విట్జర్లాండుకు వెళ్లనున్నాయి. స్విస్లోని అత్యంత విలాసవంతమైన సెయింట్ మోరిట్జ్ హోటల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి ఐదువందల మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications