గోమాంసం: అఖ్లాక్ హత్య కేసులో 10 మంది అరెస్టు
లక్నో: దాద్రీలో మహమ్మద్ అఖ్లాక్ హత్య కేసులో నిందితులు అందరిని అరెస్టు చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. గోమాంసం ఇంట్లో పెట్టుకున్నాడనే కారణంతో అతన్ని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.
సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. వివేక్, శ్రీ ఓం, విశాల్, శివం, రూపేంద్ర, సందీప్, సౌరబ్, గౌరవ్, హరి ఓంతో సహ ఓ మైనర్ ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. హరి ఓం తప్పించుకుని బంధువుల ఇంటిలో తలదాచుకున్నాడు.

అతని ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీసి బంధువుల ఇంటిలో తలదాచుకున్నాడని గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే అందరిని అరెస్టు చేశామని విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
విశాల్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడని పోలీసులు వివరించారు. ఇంటిలో గోమాంసం పెట్టుకున్నాడని ఆరోపిస్తు దాద్రిలోని బిసాహోదా గ్రామంలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మొదట ఆరోపణలు వచ్చాయి.
అహమ్మద్ అఖ్లాక్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ విషయంపై స్పందించారు. మొదట కేసు నత్తనడకన దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ఈ కేసులో అందరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications