అండర్ వరల్డ్ డాన్ దావూద్ను అరెస్ట్ చేస్తాం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ నేరస్తుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్లో తలదాచుకున్నట్లుగా భావిస్తున్న దావూద్ను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వాలు కూడా దావూద్ను పట్టుకోడానికి ప్రయత్నించాయని, తమ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నంలో ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దావూద్ ఎక్కడున్నా తాము పట్టుకుని అరెస్ట్ చేస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్న దావూద్ 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు. ఈ పేలుళ్లలో సుమారు 300 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్లో ఉంటూ ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ మద్దతుతో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భారత్ అనుమానిస్తోంది.