దేశంలో ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ చూసినా యూపీఐ ఆధారిత పేమెంట్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రజలు ఎక్కువగా నగదును వాడటం తగ్గించేశారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి దేశ వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అన్ని అభివృద్ధి, ఆదాయ సేకరణ కోసం తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను చేసేలా పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని పేర్కొంది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల సమక్షంలో రాష్ట్రాలు పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది.

దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎంఎఫ్ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయన్నారు. ఇకపై పంచాయతీలు డిజిటల్గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు, నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయని తెలిపారు.
జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వ శాఖ కోరింది. యూపీఐ ప్లాట్ఫాంలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించిన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వ శాఖ పంచుకుంది. జులై 15 నాటికి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసుకోవాలని, జులై 30 లోపు వెండర్లను ఖరారు చేయాలని సూచించింది. అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలను తెలిపింది.
డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ స్పష్టం చేశారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023 జనవరిలోనే BHIM ద్వారా రూ.12.98 లక్షల కోట్ల విలువైన 806.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ లావాదేవీలలో గ్రామీణ, పెరి-అర్బన్ ప్రాంతాల సహకారం దాదాపు 50 శాతం ఉంది.మంత్రిత్వ శాఖ ప్రకారం.. పంచాయతీరాజ్ సంస్థలు (PRIలు) PFMS-eGram Swaraj ఇంటర్ఫేస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాయి, 90 శాతం PRIలు ఆన్లైన్లో ఆడిట్ చేయబడ్డాయి.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications