బక్రీద్ వేడుకలు, సీఎంకు అఖిల పక్ష సంఘాలు వార్నింగ్, ఏం జరుగుతుందో అంటూ !
బెంగళూరు: బక్రీద్ పండుగకు ముందే బెంగళూరులోని ఈద్గా మైదానంలో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరు నగరంలోని చామరాజ్పేటలోని ఈద్గా మైదానంలోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తారని జోరుగా ప్రచారం జరగడంతో అఖిలపక్ష సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇప్పటి వరకు ఈద్గా మైదానంలో కన్నడ రాజ్యోత్సవాలు, గణేశుడి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు బక్రీద్ పండుగ వేడుకల కోసం ఎలా అనుమతి ఇస్తారని పలు సంస్థలు బీబీఎంపీ అధికారులను నిలదీస్తున్నారు.
జూన్ 29వ తేదీన బెంగళూరు నగరంలోని చామరాజపేట్ క్రీడా మైదానంలో జరిగే బక్రీద్ పండుగ వేడుకు ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. చామరాజపేట్ క్రీడా మైదానంలో పాల్గొనేందుకు సీఎం సిద్ధరామయ్య చామరాజ్పేటలోని ఈద్గా మైదాన్కు వస్తున్నారని పలు సంఘ, సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం సిద్ధరామయ్యను ఈద్గా మైదానంలోకి రానివ్వవద్దని అఖిల పక్షసంఘాలు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సీఎం సిద్దరామయ్య బక్రీద్ వేడుకలకు రాకుండా మీరే చూడాలని అఖిల పక్ష సంఘాలు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు విజ్ఞప్తి చేశాయి. ఇదే సమయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని సీఎం సిద్ధరామయ్య ఇక్కడికి వస్తే నిరసన తెలుపుతామని అన్ని సంస్థలు, సంఘాలు హెచ్చరించాయి.
చామరాజ్పేట ఎమ్మెల్యే, మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆహ్వానం మేరకు సీఎం సిద్ధరామయ్య బక్రీద్ వేడుకల్లో పాల్గొంటున్నారు. వివాదాస్పద స్థలం కావడంతో ఈ వేడుకలో సీఎం సిద్దరామయ్య పాల్గొనకూడదనేది ఆయా సంస్థల వాదన. ఇంతకు ముందు ఈద్గా మైదానంలో అని ఇప్పుడు క్రీడామైదానం అని పిలుస్తున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని సీఎం సిద్ధరామయ్య ఇక్కడికి వస్తున్నారు.
ఇది వివాదాస్పద స్థలం అని, ఏ కారణం చేతనైనా సీఎం సిద్దరామయ్య ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొనకూడదని, అలా చేస్తే ఒక్క వర్గానికి మాత్రమే సీఎం మద్దతిస్తున్నారని ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయని, ఆయన ఇక్కడికి వస్తే ఇంతకు ముందు సిద్దరామయ్యకు ఉన్న సెక్యులర్ నాయకుడిగా పేరు చెడిపోతుంది ఆల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ నాయక్ అన్నారు.
బక్రీద్ వేడుకల నేపథ్యంలో ఈద్గా మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు. వందలాది మంది ముస్లిం యువకులు మైదానాన్ని శుభ్రం చెయ్యడానికి స్వచ్చందంగా తరలి వచ్చారు. బక్రీద్ పండుగ రోజున వేలాది మంది ముస్లింలు ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేస్తారు. బక్రీద్ జరుపుకోవడానికి మేం వ్యతిరేకం కాదు. అయితే ఈద్గా మైదానంలో జరిగే బక్రీద్ వేడుకల్లో సీఎం సిద్ధరామయ్య పాల్గొనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్ని సంస్థల యూనియన్ స్పష్టంగా ప్రకటించింది. బీబీఎంపీ అధికారులకు ఈ విషయంపై లేఖ రాయాలని కూడా సంఘం నిర్ణయించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications