Lok Sabha Election 2024: 89 సీట్లలో రేపు లోక్ సభ రెండో దశ పోరు-బీజేపీకి సవాల్..!
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లలో రేపు జరిగే రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. ఇలా తొలి దశ పూర్తి చేసుకున్న రాష్ట్రాల్లో రేపు రెండో దశ పోలింగ్ జరగబోతోంది. అలాగే మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేపు ఒకే దశలో పోలింగ్ కూడా జరగబోతోంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
89 సీట్లలో రెండో దశ పోలింగ్ :
రేపు రెండో దశ పోలింగ్ జరగబోతున్న 89 లోక్ సభ సీట్లలో 2019 ఎన్నికల్లో బీజేపీ 55, కాంగ్రెస్ 18 సీట్లు గెల్చుకున్నాయి. అయితే అప్పట్లో గెలిచిన సీట్లను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ 89 సీట్లలో 9 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడు సీట్లు కూడా ఉన్నాయి. 2019లో ఎన్డీయే కూటమి పార్టీలు వీటిలో 61 సీట్లను గెల్చుకోగా.. ఇప్పుడు ఇండియా కూటమిగా ఏర్పడిన పార్టీలు 23 సీట్లు గెల్చుకున్నాయి. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితుల్లో చాలా మార్పు వచ్చింది.

1210 మంది అభ్యర్ధులు:
రెండో దశ పోలింగ్ జరుగుతున్న 89 సీట్లలో మొత్తం 1,210 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశలో బీఎస్పీ అత్యధికంగా 74 మంది అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 69 మంది, కాంగ్రెస్ 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. కర్ణాటకలో 14 స్థానాల్లో అత్యధికంగా 247 మంది అభ్యర్థులు, మహారాష్ట్ర (8 సీట్లు) 204 మంది ఉన్నారు. కేరళలో (మొత్తం 20 సీట్లు) 189 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
క్రిమినల్ కేసులు:
ఈసారి క్రిమినల్ కేసులు ఉన్న 250 మంది అభ్యర్థుల్లో అత్యధికంగా కేరళలో 67 మంది, మహారాష్ట్రలో 49 మంది, కర్ణాటకలో 39 మంది ఉన్నారు. కేరళలో మూడో వంతు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులందరిలో 35 మందిపై లేదా 51 శాతం మంది అభ్యర్దులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ అభ్యర్ధుల్లో 31 మంది లేదా 45 శాతం మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. సీపీఎం నిలబెట్టిన 18 మందిలో 14 మంది కేసులు ఎదుర్కొంటున్నారు.
కోటీశ్వరుల అభ్యర్థులు:
రెండో దశలో పోటీ చేస్తున్న 390 మంది కోటీశ్వరుల అభ్యర్థులలో కర్ణాటకలో అత్యధికంగా 80 మంది ఉన్నారు. కేరళలో 63 మంది, మహారాష్ట్రలో 60 మంది ఉన్నారు. అభ్యర్థులందరిలో 42 మంది కోటీశ్వరులు యూపీలోని ఎనిమిది సీట్లలో 46 శాతం మంది అభ్యర్థులు రెండవ స్థానంలో ఉన్నారు. బీజేపీ అత్యధిక కోటీశ్వరుల అభ్యర్థులను 64 మందిని లేదా 93శాతం మందిని కలిగి ఉంది. కాంగ్రెస్ లోనూ 62 మంది లేదా 91శాతం అభ్యర్ధులు కోటీశ్వరులే. రెండో దశలో అత్యంత ధనవంతులైన ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్కు చెందినవారే. ఈ దశలో కనీసం ఆరుగురు ఇండిపెండెంట్లు సున్నా ఆస్తులను ప్రకటించారు.
అత్యంత ధనవంతులైన అభ్యర్థులు:
ఈసారి పోటీ చేస్తున్న అత్యంత ధనవంతుల్లో కర్ణాటకలో మాండ్యా నుంచి బరిలోకి దిగిన వెంకటరమణ గౌడ (కాంగ్రెస్) రూ.623 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. అలాగే బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్న డీకే సురేష్ కు రూ.593 కోట్లు ఉన్నాయి.
యూపీలోని మధుర నుంచి పోటీ చేస్తున్న హేమమాలిని ఆస్తులు రూ.279 కోట్లు. అలాగే రెండో దశలో మొత్తం 100 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొదటి రెండు దశల్లో మొత్తం 235 మంది అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ అత్యధిక మహిళా అభ్యర్థులను కలిగి ఉంది. తర్వాత స్ధానంలో కాంగ్రెస్, బీఎస్పీకి ఆరేసి అభ్యర్ధులున్నారు. కేరళలో అత్యధికంగా 24 మంది మహిళా అభ్యర్థులున్నారు.
ఈసారి ఎన్నికలు ఇక్కడే :
ఈసారి కేరళలోని మొత్తం 20 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 2.71 కోట్ల మంది ఓటేయబోతున్నారు. ఇందులో తొలిసారి ఓటర్లు 5.34 లక్షలు. ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 8 సీట్లు (అకోలా, అమరావతి, బుల్దానా, హింగోలి, నాందేడ్, పర్భానీ, వార్ధా, యవత్మాల్-వాషిం)కి ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో 7 సీట్లు (బేతుల్, దామో, హోషంగాబాద్, ఖజురహో, రేవా, సత్నా, తికమ్గఢ్)కు రేపు పోలింగ్ జరుగుతుంది. అస్సాంలో 5 సీట్లు (దీఫు, కరీంగంజ్, దర్రాంగ్-ఉదల్గురి, నాగావ్, సిల్చార్)క రేపే పోలింగ్ ఉంది.
ఇక్కడ హోరాహోరీ పోరు :
బీహార్లో 5 సీట్లు (బంకా, భాగల్పూర్, కతిహార్, కిషన్గంజ్, పూర్నియా), ఛత్తీస్గఢ్ లో 3 సీట్లు (కంకేర్, మహాసముంద్, రాజ్నంద్గావ్), పశ్చిమ బెంగాల్ లో 3 సీట్లు (బాలూర్ఘాట్, డార్జిలింగ్, రాయ్గంజ్), (జమ్ము)లో రేపు పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఆసక్తికర పోటీ నెలకొన్న సీట్లలో కేరళలోని వాయనాడ్, తిరువనంతపురం, కర్నాటకలోని మాండ్యా,
రాజస్తాన్ లోని జోథ్ పూర్, ఛత్తీస్ ఘడ్ లోని రాజ్ నంద్ గావ్ ఉన్నాయి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications