లఢక్ సరిహద్దు ఘర్షణల్లో 5 మంది చైనా సైనికులు మృతి: మీడియా కథనాలపై నోరువిప్పని డ్రాగన్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా కూడా ప్రాణనష్టాన్ని చవి చూసినట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన అయిదుమంది సరిహద్దు భద్రతా సైనికులు ఈ ఘర్షణల్లో చనిపోయినట్లు పేర్కొంది. భారత్ సైనికులు ఉద్దేశపూరకంగా ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. మొదటగా వారే తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చినట్లు కథనాలను ప్రచురిస్తోంది.
భారత్ సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణల్లో అయిదుమంది పీఎల్ఏ జవాన్లు మరణించినట్లు గ్లోబల్ టైమ్స్ను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది ఆ దేశ మీడియా. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి మౌత్పీస్గా గుర్తింపు ఉన్న మీడియా హౌస్ గ్లోబల్ టైమ్స్. చైనా సైనికులు మరణించిన విషయాన్ని తాము ధృవీకరించలేదని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా సైన్యం ప్రాణనష్టాన్ని చవి చూసినట్లు ఇప్పటిదాకా తాము ఎక్కడా ధృవీకరించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

The official Global Times accounts have NEVER reported the exact casualties on the Chinese side. The Global Times CANNOT confirm the number at the moment.
— Global Times (@globaltimesnews) June 16, 2020
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మృతి చెందారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నప్పటికీ.. ప్రభుత్వాధినేతలు మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. మీడియాలో వస్తోన్న కథనాలను తోసి పుచ్చట్లేదు. అలాగనీ సమర్థించనూ లేదు. అదే సమయంలో- రెండు వైపులా ప్రాణనష్టం సంభవించిందంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రకటనల పట్ల కూడా చైనా ప్రభుత్వం తన స్పందనను తెలియజేయట్లేదు.
Based on what I know, Chinese side also suffered casualties in the Galwan Valley physical clash. I want to tell the Indian side, don’t be arrogant and misread China’s restraint as being weak. China doesn’t want to have a clash with India, but we don’t fear it.
— Hu Xijin 胡锡进 (@HuXijin_GT) June 16, 2020
అయినప్పటికీ- అయిదుమంది పీఎల్ఏ సైనికులు మరణించినట్లు చైనా మీడియా చెబుతోంది. రెండు దేశాల సైనికులు ఒకరినొకరు బాహాబాహికి దిగారని, రాళ్లు రువ్వుకున్నారనీ చైనా మీడియా పేర్కొంటోంది. ఒక దశలో కాల్పులు కూడా చోటు చేసుకున్నట్లు పీఎల్ఏ అధికారులను ఉటంకిస్తూ కథనాలను రాసుకొచ్చింది. అదే సమయంలో- కాల్పులు చోటు చేసుకున్నాయనడానికిి ఎలాంటి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేస్తోంది.
Recommended Video
I cited an Indian source of @NewsLineIFE about a physical clash at LAC China-India border yesterday. No confirmation from the official Chinese source regarding casualties yet. It is unprofessional for Indian media to say this is official news from the Chinese side. @IndiaToday pic.twitter.com/OIGBKq61Gn
— Wang Wenwen (@WenwenWang1127) June 16, 2020












Click it and Unblock the Notifications