అమర్నాథ్ యాత్రపై తాజా అప్డేట్- అధికారుల కీలక నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోండటం వల్ల అమర్నాథ్ను దర్శించడానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు గుర్తించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ తెల్లవారు జాము నుంచి అమర్నాథుడి గుహను సందర్శించడానికి యాత్రికులెవరికీ అనుమతించలేదని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల వల్ల బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే- అమర్నాథ్ యాత్రను పునరుద్ధరిస్తామని చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళ ఎనిమిదో బ్యాచ్ అమర్నాథ్ దర్శనానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 7,010 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 5,179 మంది పురుషులు, 1,549 మంది మహిళలు, 21 మంది పిల్లలు, 228 మంది సాధువులు, 33 మంది మహిళా సాధువులు ఉన్నారు. వారంతా 247 వాహనాల్లో వారిని బల్తాల్ పహల్గామ్ బేస్ క్యాంప్స్ నుంచి వెళ్లాల్సి ఉంది.
అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోన్నందు వల్ల వారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇవ్వాళ్టికి అమర్నాథ్ యాత్రను రద్దు చేశారు. వాతావరణం అనుకూలంగా లేదని వెల్లడించారు. వర్షాల వల్ల కొన్ని చోట్ల మార్గం ధ్వంసమైందనే సమాచారం ఉందని బేస్ క్యాంప్ వద్ద సిబ్బంది వెల్లడించారు. వర్షం తగ్గిన తరువాత పరిస్థితులను బట్టి పునరుద్ధరిస్తామని అన్నారు.
అమర్నాథ్ యాత్ర మొత్తం 62 రోజుల పాటు సాగుతుంది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31వ తేదీ నాటికి ముగుస్తుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 80,000 మందికి పైగా భక్తులు అమర్నాథుడిని దర్శించుకున్నారు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది అమర్నాథుడి గుహ. లాడార్ లోయలో.. రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
కాగా- అనంత్నాగ్, బుద్గామ్, గందర్బల్, కుల్గామ్, పుల్వామా, షోపియాన్, కిష్త్వార్, రాంబన్, రియాసి, సాంబా, దోడా, ఉధంపూర్, కథువా, జమ్ము, రాజౌరి జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ది వెదర్ ఛానల్ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications