చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్
ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిన డ్రాగన్ బలగాలు.. తాజాగా చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల్ని చెరిపేసేందుకు విఫలయత్నం చేశాయి. ఈ ఉదంతంపై వివాదం కొనసాగుతుండగానే.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానసరోవరం దగ్గరా డ్రాగన్ సైనిక చర్యల్ని ముమ్మరం చేసినట్లు రిపోర్టులు వచ్చాయి.
Recommended Video
కైలాస శిఖరం, సరోవర సరస్సును కలిపి కైలాస మానసరోవరంగా పిలుచుకోవడం తెలిసిందే. సైనిక పరంగానూ కీలక మైన ఆ ప్రాంతంలో చైనా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు గతంలోనే వెల్లడైంది. అయితే, అక్కడ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మాత్రం తాజాగా బయటపడింది. హిందువుల పవిత్ర స్థలాలకు సమీపంగా చైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నది.

సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో, సుమారు 80 కి.మీ. పొడవున చైనా సైనిక నిర్మాణాలు, వాహనాలు, బలగాల మోహరింపునకు సంబంధించిన దృశ్యాలు శాలిలైట్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భూతలంపైనుంచి ఆకాశంలో గల టార్గెట్లను ఛేదించగల మిసైళ్లను కూడా చైనా మోహరించింది. ఇప్పటికే తూర్పు లదాక్ అంతటా ఉద్రిక్తతలు నెలకొన్నవేళ తాజాపరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నది.

తూర్పు లదాక్ లో తాజా పరిస్థితిపై హోం, రక్షణ శాఖలు నిరంతరాయంగా ప్రధాని నరేంద్ర మోదీకి బ్రీఫింగ్ ఇస్తున్నాయి. ఈనెల 29-30 అర్ధరాత్రి జరిగిన సంఘటనల్లో హింస చోటుచేసుకోలేదని, సరిహద్దులు చెరిపేసేందుకు చైనా ప్రయత్నించగా, భారత్ అడ్డుకుందని ఆర్మీ వెల్లడించింది. అయితే, ఇది వట్టి ఆరోపణే అని, చైనీస్ ఆర్మీ ఎల్ఏసీని దాటలేదని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications