ఆరు రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసేందుకు ఆరు పంటలపై మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గోధుమపై కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 50 పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం వెల్లడించారు. మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచినట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే గోధుమపై ఎంఎస్పీ(కనీస మద్దతు ధర )క్వింటాలుకు రూ. 50 పెంచుతూ.. ధరను రూ. 1975గా నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇక శనగపై రూ. 250, మసూర్ పప్పుపై రూ. 300, ఆవాలపై రూ. 225లు క్వింటాలుకు ఎంఎస్పీ పెంచేదుకు కమిటీ ఆమోదించిందని తెలిపారు.
ఎంఎస్పీ, మార్కెట్ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుందన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
విపక్షాల ఆందోళనల మధ్యే రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి మూడు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా, బిల్లులకు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమయ్యాయి విపక్షాలు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications