అమిత్ షా చెప్పిందే నిజమైంది, కానీ: అఖిలేష్ తొందరపడ్డారు!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ముందు ఊహించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే ఊహించినట్లున్నారు. అందుకే యూపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓ మాట అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ముందు ఊహించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే ఊహించినట్లున్నారు. అందుకే యూపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓ మాట అన్నారు. అది ఇప్పుడు నిజమైంది.
అసలు అమిత్ షా ఏమన్నారంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్ యాదవ్కు ఓటమి తప్పదని, మార్చి 11న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడతాయని, మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
అప్పుడన్న అమిత్షా మాటలు శనివారం వెలువడిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వాస్తవం చేశాయి. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఎస్పీ నేత, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే అమిత్షా జోస్యం చెప్పినట్టు మధ్యాహ్నం ఒంటిగంటకు కాకుండా అంతకంటే ముందుగా 11 గంటలకే అఖిలేశ్ రాజీనామా చేయడం గమనార్హం.

శనివారం 10.30గంటలకే ఫలితాలు వెలువడటంతో అఖిలేశ్ రాజీనామా చేశారు. అయితే, ఆ సమయానికే బీజేపీ 200కిపైగా సీట్లలో ఆధిక్యం చాటుకుంది. రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారంలో కీలకపాత్ర పోషించిన అమిత్షా ప్రచారంలో అఖిలేశ్ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలోను ప్రధాన పాత్ర పోషించారు.
రాష్ట్రంలో ఓబీసీ వర్గాలైన రాజ్బర్, కుర్మీ, కొయిరీ... తదితరులను పార్టీవైపు మళ్లించడంలో విజయం సాధించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడంలో సఫలీకృతుడు కావడంతో యూపీలో బీజేపీ ఘన విజయం సాధ్యమైంది. ఈ విజయంతో యూపీ బీజేపీ సంబరాల్లో మునిగితేలుతోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications