అమిత్ షాకు ప్రమోషన్!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయం కోసం దేశ హోంమంత్రి మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విభజనవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.
మహారాష్ట్రలో అద్భుత విజయంతో అమితమైన ఆనందంలో ఉన్న అమిత్ షాకు 24 గంటల్లోనే మరో శుభవార్త అందింది. అమిత్ షాకు తన కుటుంబంలో ప్రమోషన్ వచ్చింది. అవును, ఆయన తాత అయ్యారు. అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాకు మగ బిడ్డ జన్మించాడు.
సౌదీ అరేబియాలో జరుగుతున్న IPL 2025 మెగా వేలం సందర్భంగా నవంబర్ 24 ఆదివారం నాడు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ సమాచారాన్ని వెల్లడిచారు. 'జయ్ షా భారత్కు ఆఫ్ఫీల్డ్ కెప్టెన్. మళ్లీ తండ్రి అయినందుకు ఆయనకు అభినందనలు' అని జై షాను అరుణ్ ధుమాల్ ప్రశంసించారు.

కాగా, భారత ఆన్-ఫీల్డ్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇటీవలే రెండవ సారి తండ్రి అయిన విషయం తెలిసిందే. రోహిత్కు కూడా మగ బిడ్డ జన్మించాడు. ఈ కారణంగా రోహిత్ ఆస్ట్రేలియాతో పెర్త్లో తన జట్టు ప్రారంభ టెస్ట్ మ్యాచ్లో ఆడలేకపోయాడు. తాజాగా, జై షాకు కూడా మగబిడ్డ పుట్టాడని దుమాల్ వెల్లడించారు.
మరోవైపు, IPL మెగా వేలం నేటి నుంచి ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతుంది. నేడు, మొదటి రోజు, అన్ని మార్క్యూ ప్లేయర్లు అమ్ముడయ్యాయి. మొత్తం 12 మంది మార్క్యూ ప్లేయర్ల పేర్లు క్రిందివి... జోస్ బట్లర్ (ఇంగ్లండ్) శ్రేయాస్ అయ్యర్ (భారతదేశం) రిషబ్ పంత్ (భారత్) కగిసో రబడ (దక్షిణాఫ్రికా) అర్ష్దీప్ సింగ్ (భారతదేశం) మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) యుజ్వేంద్ర చాహల్ (భారతదేశం) లియామ్ లివింగ్స్టోన్ (ఇంగ్లండ్) డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) కేఎల్ రాహుల్ (భారత్) మహ్మద్ షమీ (భారత్) మహ్మద్ సిరాజ్ (భారతదేశం).
కాగా, అర్ష్దీప్ సింగ్ విక్రయించబడిన మొదటి ఆటగాడు.. పంజాబ్ కింగ్స్ ₹18 కోట్లకు అతడ్ని కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ ₹10.785 కోట్లకు కగిసో రబాడను, ₹15.75 కోట్లకు జోస్ బట్లర్ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ను ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొనుగోలు చేసింది. కానీ నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వారి రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ను ₹27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications