కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..: అమిత్ షాపైనే భారం
ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ పేలుడు కోసం ఉపయోగించిన హ్యుందాయ్ i20 నంబర్ HR 26 CE 7674కారుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కారు 2014 నుండి నాలుగు సార్లు చేతులు మారింది. దీనికి సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా నమోదు కాలేదని దర్యాప్తులో తేలింది. తొలుత సల్మాన్ అనే వ్యక్తి ఈ కారును 2014 మార్చి 18న కొనుగోలు చేశారు. ఆ తర్వాత దేవేంద్ర, సోనూ దీన్ని కొన్నారు. చివరిగా తారిఖ్ పేరు మీద ఇది రిజిస్టర్ అయింది. ఇవేవీ రికార్డుల్లో లేవు.
దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దింగింది. సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రకదలికలపై నిఘా పెట్టింది. యూఏపీఏ కింద కేసులు నమోదయ్యాయి. యూఏపీఏలోని సెక్షన్లు 16, 18, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్లోని సెక్షన్లు 3, 4, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1), 109(1), 61(2) కింద ఈ కేసు పెట్టారు. రెడ్ ఫోర్ట్ ను మూసివేశారు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే- రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ కూడా క్లోజ్ అయింది.
మరోవంక- ఈ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ కర్తవ్య భవన్లో ఈ భేటీ ఏర్పాటైంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications