అన్నామలైకి ఏమైయ్యింది ?, డాక్టర్లు, ఢిల్లీ ఆదేశాలతో విశ్రాంతి, పాదయాత్రకు బ్రేకులు, అధికారం!

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి అన్నాడీఎంకే (dmk)పార్టీ ఎన్ డీఏకి దూరం కావడానికి కారణం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) ఇప్పటికే పాదయాత్ర (padayatra) నిర్వహిస్తున్నారు. ఎన్ మన్, ఎన్ మక్కల్ అనే పేరుతో ఇప్పటికే మూడు దశల పాదయాత్రను (Annamalai) పూర్తి చేసుకున్నారు. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ మహా పాదయాత్ర తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది.

పాదయాత్ర, పార్టీ (BJP) సంస్థగత ఎన్నికలు, ఢిల్లీ పర్యటనల వంటి బిజీ షెడ్యూల్స్ కారణంగా అన్నామలై (Annamalai) ఆరోగ్యం క్షీణించింది. దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యల ఎదుర్కొంటున్న కారణంగా అన్నామలైని చెన్నైలోని గ్లెనెగల్స్ గ్లోబల్ సిటీ హెల్త్ హాస్పిటల్‌లో చేరారు. అన్నామలైకి విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించడంతో తదుపరి పాదయాత్ర వాయిదా పడింది. గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న అన్నామలైకి (Annamalai) నిపుణుల బృందం చికిత్స అందించింది. అన్నామలైకి సీటీ స్కానింగ్ (CT) స్కాన్‌తో సహా ఇతర పరీక్షలు నిర్వహించారు.

Annamalais padayatra has been postponed for two weeks in Tamil Nadu

అన్నామలైకి రెండు ఊపిరితిత్తులలో కొన్ని (padayatra)ఆరోగ్య సమస్యలు గుర్తించబడ్డాయి. దీనికి చికిత్స చేశారు. అన్నామలై (Annamalai) ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని అన్నామలైకి సూచించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అన్నామలై (BJP)ఆరోగ్యంపై గ్లోబల్ హెల్త్ సిటీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 39 ఏళ్ల అన్నామలై అక్టోబర్ 3వ తేదీన గ్లోబల్ సిటీ హెల్త్ హాస్పిటల్‌లో చేరారు.

సీటీ (CT) స్కాన్‌తో సహా మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఎడమ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కనిపించింది. అన్నామలై (Annamalai) ఆరోగ్యంగా త్వరగా కోలుకోవడానికి తగిన వైద్య మందులు అందించారు. అనంతరం ఇంట్లో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని (padayatra)అన్నామలైకి డాక్టర్లు సూచించారు. 5 రోజుల తర్వాత మళ్లీ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.

Annamalai padayatra

కనీసం 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని (BJP)గ్లోబల్ హెల్త్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బోర్డు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అన్నామలై (Annamalai) కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. తద్వారా తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్నామలై పాదయాత్ర (padayatra) నిర్వహించడానికి పక్కాప్లాన్ చేశారు. అన్నామలై ఇప్పటికే మూడు దశల పాదయాత్రను పూర్తి చేశారు.

షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర (BJP) వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు రెండు వారాల విశ్రాంతి కారణంగా ఈ పాదయాత్ర ముగింపు తేదీని మార్చనున్నారు.

దాదాపు 6 నెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో అన్నామలై (Annamalai) మొత్తం 1, 770 కిలోమీటర్లు పాదయాత్ర (padayatra) చెయ్యనున్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వాహనంలో వెళ్తారని అన్నామలై సన్నిహితులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+