వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కొడనాడు ఏస్టేట్ అకౌంటెంట్ దినేష్ ఆత్మహత్య

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొత్తగిరిలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొత్తగిరిలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు.

దీంతో కొడనాడు ఏస్టేట్ కు చెందిన అనుమానాస్పద మృతుల సంఖ్య నాలుగుకుచేరింది. రెండు నెలల క్రితమే కొడనాడు ఏస్టేట్ లో ఓ సెక్యూరిటీ గార్డును దుండగులు హత్య చేశారు.

జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు చోరిచేయడానికి వచ్చిన వారు ఆ సిబ్బందిని హతమార్చారు.అయితే తర్వాత వీరిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో వ్యక్తి కూడ రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య, కుమార్తె చనిపోయారు.

Another Death At Jayalalithaa's Nilgiris Estate, Accountant Found Hanging

తాజాగా జయ కొడనాడు ఏస్టేట్ లో పనిచేస్తున్న ముగ్గురు అకౌంట్టలలో ఒకరైన దినేష్ కుమార్ సోమవారం నాడు ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం కొత్తగిరి ఆసుపత్రికి తరలించారు. మంగళవారం నాడు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నారు. ఎస్టేట్ లోని ఇతర ఉద్యోగులు కలిసి రెండు రోజుల క్రితమే తమను ఉద్యోగాల నుండి తొలగిస్తారేమోననే ఆందోళన చెందారని సమాచారం.

ఏస్టేమ్ మేనేజ్ మెంట్ లో మార్పులు చోటుచేసుకొంటున్నట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే దినేష్ మృతి వెనుక కుటుంబపరమైన వివాదాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారిస్తున్నారు.

English summary
In yet another death of a person connected with former Tamil Nadu chief minister Jayalalithaa's Kodanadu estate, an accountant was found hanging at his home near Udhagamandalam on Monday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X