సాంకేతిక లోపం: 180 ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో ఎయిర్బస్ రిటర్న్
కోల్కతా: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో సిలిగురి నుంచి కోల్కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యతో టేకాఫ్ అయిన కాసేపటికే సిలిగురిలోని బదోగ్రా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ విమానం టేకాఫ్ అయ్యింది. విమానం ఇంజిన్లో సమస్య తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుతిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇండిగో ఎయిర్ బస్ ఏ320 నియోలో తరచూ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

ఇదే ఇంజిన్ వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఇటీవల తరచూ ఇలాంటి సమస్యతోనే ల్యాండ్ అవడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి ఇండిగో తన ఎయిర్బస్ ఏ320 నియో విమానాల ఇంజిన్లను సవరించాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఈ ఇంజిన్ వేరియంట్ను అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ వైట్నీ కంపెనీ తయారు చేస్తోందని తెలిసింది. ఇండిగో పోటీదారు అయిన గోఎయిర్ కూడా ఈ కంపెనీకి చెందిన ఇంజిన్లనే వాడుతుండటంతో ఆ సంస్థ విమానాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుండటం గమనార్హం. తక్కువ ధరకే ఇంజిన్లను అందించడంతో విమానయాన సంస్థలు ఈ కంపెనీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications