ఢిల్లీ పేలుడు మరో వీడియో విడుదల
Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం ఓ భారీ పేలుడు ఘటన కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా దాదాపు 9 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ గేట్ నంబర్-1 సమీపంలో జరిగిన కారు పేలుడుకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
రెడ్ లైట్ వద్ద ఆగిన కారు
ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందు కారు కదలికలు కీలకంగా మారాయి. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ.. "సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనం రెడ్ లైట్ వద్ద ఆగింది. ఆ వాహనంలోనే పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి," అని తెలిపారు. కొత్తగా విడుదలైన వీడియోలో పేలుడు సమయంలో రహదారిపై ప్రజలు గుమిగూడి ఉండగా.. అకస్మాత్తుగా కారులో నుంచి ప్రకాశవంతమైన పసుపు కాంతి వచ్చి, ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు కనిపిస్తోంది.

పేలుడు వెనుక కశ్మీరీ డాక్టర్ ఉమర్?
పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 కారును కశ్మీరీ డాక్టర్ మహమ్మద్ ఉమర్ నడుపుతున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్కు ఇటీవల ఫరీదాబాద్లో భగ్నం చేయబడిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు ముందు ఉమర్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, పేలుడు జరిగిన కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో దరియాగంజ్ మార్కెట్ నుంచి శాంతివణ్ మార్గంలో ఎర్రకోట సమీపంలోని ఒక పార్కింగ్కు కారు చేరుకుంది. దాదాపు రెండు గంటల తర్వాత పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరి పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో యూ-టర్న్ తీసుకుని లోయర్ సుభాష్ మార్గ్ వైపు వెళ్లినట్లు రికార్డైంది.
#WATCH | Delhi | CCTV footage shows explosion from car blast near the Red Fort yesterday. Eight people lost their lives in the incident.
— ANI (@ANI) November 11, 2025
(Video source: President of Chandni Chowk Vyapar Mandal) pic.twitter.com/aVLqQM0BgH
ఎర్రకోట, మెట్రో స్టేషన్ మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. చారిత్రక ఎర్రకోటను మూడు రోజుల పాటు పర్యాటకుల కోసం మూసివేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా భద్రతా కారణాల వల్ల వయొలెట్ లైన్లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేసింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications