రిజర్వేషన్ల రద్దుకు డిమాండ్. ఢిల్లీ వీధుల్లో మోదీ సర్కార్కు కొత్త తలనొప్పి!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా భారీ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇన్నాళ్లూ సోషల్ మీడియా వేదికగా సాగిన డిజిటల్ ప్రచారం కాస్తా, ఒక్కసారిగా వీధిపోరాటంగా రూపాంతరం చెందింది. 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) పిలుపుతో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువకులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు పోటెత్తారు. కర్ణి సేన, రణబీర్ సేన వంటి సామాజిక సంస్థల మద్దతుతో జరిగిన ఈ భారీ ముట్టడి, కేంద్ర ప్రభుత్వానికి ఊహించని సవాలుగా మారింది.
కుల ప్రాతిపదిక కాదు.. ఆర్థిక ప్రాతిపదికనే కొలమానం!
ఈ ఆందోళనలో ప్రధానంగా వినిపించిన డిమాండ్ ఒకటే.. రిజర్వేషన్లను కులం ఆధారంగా కాకుండా పూర్తిగా ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే అమలు చేయాలి. ఇన్స్టాగ్రామ్ ద్వారా విద్యార్థి హర్ష్ దూబే ప్రారంభించిన ఈ ఉద్యమం, ఆ తర్వాత అనురాధ తివారీ, అజీత్ భారతి, నేహా దాస్ వంటి సామాజిక కార్యకర్తల నేతృత్వంలో తీవ్రరూపం దాల్చింది. కులాల ఆధారంగా కాకుండా పేదరికమే ప్రామాణికంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలని వారు పట్టుబడుతున్నారు.

యూజీసీ నిబంధనల రద్దు.. కీలక డిమాండ్లు ఇవే!
కేవలం రిజర్వేషన్ల సవరణ మాత్రమే కాకుండా, పలు కీలక విధానాల్లో మార్పులు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
- యూజీసీ సమగ్ర నిబంధనల ఉపసంహరణ: 2026 నాటి యూజీసీ కుల-సమానత్వ (caste-equity) నిబంధనలను తక్షణమే రద్దు చేయాలి.
- ఒకే కుటుంబం - ఒకే రిజర్వేషన్: లబ్ధిదారుల జాబితాను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఒక కుటుంబంలో ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్ వర్తించేలా "వన్ ఫ్యామిలీ, వన్ రిజర్వేషన్" నిబంధన తీసుకురావాలి.
- పరిమితుల విధింపు: 50 శాతం రిజర్వేషన్ పరిమితి పెంపుపై పూర్తిగా నిషేధం విధించాలి, భర్తీ కాని ఖాళీలను డీ-రిజర్వ్ చేయాలి, అలాగే పరీక్షల్లో కనీస అర్హత మార్కులను నిర్బంధం చేయాలి.
- సన్సెట్ క్లాజ్: రిజర్వేషన్ల వ్యవస్థకు నిర్దిష్ట కాల పరిమితి (సన్సెట్ క్లాజ్) విధించి, నిరంతరం లబ్ధిదారుల జాబితాను ఫిల్టర్ చేయాలి.
రాజకీయంగా సంక్లిష్టంలో కేంద్ర ప్రభుత్వం
ఈ ఉద్యమం ఎంత తీవ్రమవుతుందో, అంతగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ప్రతిఘటన వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రతను, వందల ఏళ్ల అసమానతలను రూపుమాపేందుకు ఉన్న హక్కులను హరించే యత్నంగా ఈ డిమాండ్లను ఆయా సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ల వైపు మొగ్గుచూపితే, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల నుంచి భారీ ఎత్తున ఎదురుదాడి జరిగే ప్రమాదం ఉంది.
రెండు భిన్నమైన సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటించడం, ఈ నిరసనల సెగను తగ్గించడం మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన రాజకీయ పరీక్షగా మారింది.
VIDEO | Anti Reservation Protest: Police detain protesters at Jantar Mantar.
— Press Trust of India (@PTI_News) August 21, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/YSUzuEcaxw














Click it and Unblock the Notifications