'కలాంతో ఇదే చివరి ప్రయాణమని ఊహించలేదు'
న్యూఢిల్లీ: గత ఆరేళ్లుగా అబ్దుల్ కలాం సార్తో కలిసి ప్రయాణాలు చేశానని, కానీ షిల్లాంగ్ ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని అనుకోలేదని ఐఐఎమ్(అహ్మదాబాద్) పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ అన్నారు. 2009 నుంచి ఆయన కలాంతో కలిసి పలు కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో చివరిరోజు స్మృతులను, మరిన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా శ్రీజన్ సింగ్ పంచుకున్నారు. షిల్లాంగ్లోని ఐఐఎంకు వెళ్లిన సమయంలో కలాంతో పాటు ఆయన కూడా ఉన్నారు. స్టేజీపై ప్రసంగిస్తూ కలాం కుప్పకూలిపోయినప్పుడు వేదిక వద్ద ఉండి ప్రత్యక్షంగా చూసిన వారిలో శ్రీజన్పాల్ ఒకరు.

గౌహతికి బయలుదేరిన విమానంలో కలాం 1ఏ, తాను 1సీ సీట్లో కూర్చున్నామని చెప్పారు. ఆయన ముదురు రంగు సూట్ ధరించారని, ఆ సూట్ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ఒంటిపై తాను చూసే చివరి రంగు అదే అవుతుందని ఊహించలేదన్నారు.
సుమారు 2.5 గంటల పాటు విమానంలో ప్రయాణించామని అనంతరం కారులో జర్నీ చేశామని చెప్పారు. పంజాబ్లో జరిగిన ఉగ్రదాడుల గురించి ఆయన వేదన చెందారని, ఈ ఘటనలలో అమాయకులు చనిపోయారని కలాం చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.

కాగా, భద్రత కోసం వచ్చిన ఓ పోలీసు రెండున్నర గంటలపాటు నిల్చుని ఉన్న విషయాన్ని గమనించి ఆ పోలీసుకు కలాం కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. నిల్చుని ఉండేలా చేసినందుకు క్షమించాలని ఆ పోలీసును కలాం కోరినట్లు తెలిపారు. కాగా, కలాం మాటలతో.. ఆనందం వ్యక్తం చేసిన పోలీసు.. 'మీ కోసం ఆరు గంటలైనా నిల్చునేందుకు నేను సిద్ధమే'నని చెప్పినట్లు తెలిపారు.
పార్లమెంట్, రాజకీయాలు తదితర అంశాలపై కలాం దిగులు చెందారని, ఐఐఎం విద్యార్థులకు జన ప్రయోజన రాజకీయాలు చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని కలాం వారికి ఓ ప్రశ్న సంధించాలనుకున్నారని శ్రీజన్ సింగ్ చెప్పారు. తన మార్గదర్శి ఇకలేరని శ్రీజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Hre is jawan drkalam insistd2meet&thnk as he ws standin fr2.5hr in pilot vhicle.dis ws hs lst meetin
@srijanpalsingh pic.twitter.com/wNnVD0CI4W
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 28, 2015 -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications