ఎపిఎన్జీవో సభలో విషాదం: ఒకరి మృతి, ఆద్వానీతో చిరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరుగుతోన్న ఎపిఎన్జీవో సభలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. సమైక్యాంధ్ర కోరుతూ ఢిల్లీలో ఇవాళ, రేపు ఎపిఎన్జీవోలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో హస్తినలో వేలాది మంది ఎపిఎన్జీవోలు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎపిఎన్జీవో నేత దామోదర్ జోషికి సోమవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఎపిఎన్జీవోలు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎపిఎన్జీవోలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ ఘటనతో ఎపిఎన్జీవో సభలో విషాదఛాయలు అలముకొన్నాయి.

ఎపి భవన్ వద్ద కట్టుదిట్టం
ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల పాటు ఎపిఎన్జీవోలు ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నా
సమైక్యాంధ్ర కోసం జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నా చేపట్టనుంది. ఇందుకోసం భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు.
అద్వానీతో కేంద్రమంత్రులు
బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజు తదితరులు కలిశారు. బిల్లుకు మద్దతివ్వవద్దని కోరారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications