వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు: ముగ్గురు చొరబాటుదారుల హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని భద్రతావర్గాలు తెలిపాయి.

ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా కనిపించిన చొరబాటుదారులను నిఘావర్గాలు అడ్డగించి ప్రశ్నించాయి. దీంతో వారు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలో సైన్యానికి, గెరిల్లాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

Army kills three intruders in Kashmir

కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులను మట్టుపెట్టిన భద్రతా దళాలు, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

మూడు ఏకె 47 రైఫిల్స్, 12 ఏకే మాగ్జైన్స్‌ను, సుమారు 300రౌండ్ల బుల్లెట్లు, రెండు అండర్ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రక్షణాధికారి ఒకరు తెలిపారు.

English summary
Three separatist guerrillas were killed overnight in Kupwara district in Jammu and Kashmir when the Army foiled an infiltration bid on the line of control (LoC), a defence official said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X