జయలలిత మృతి మిస్టరీ: 15 మందికి నోటీసులు, పోయెస్ గార్డెన్ లో విచారణ, ఏం జరిగింది !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామి సోమవారం పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న 15 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు.
పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారు, భద్రతా సిబ్బందిని విచారించాలని రిటైర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారికి ఇప్పటికే సమన్లు జారీ చేశారు. వారందరూ సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ముందు హాజరుకానున్నారు.

అన్నాడీఎంకే పార్టీ వర్గాలు, తమిళనాడు ప్రజలు అమ్మ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి విచారణ కమిషన్ కు ఆదేశించారు. విచారణ కమిషన్ కు ప్రత్యేక కార్యాలయం, సంబంధిత ఏర్పాట్లు చెయ్యడంలో జాప్యం జరిగింది.
ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి రంగంలోకి దిగారు. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారిని మొదట విచారణ చేసి వివరాలు సేకరించాలని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. వేదనిలయంలో పని చేస్తున్న వారిని రిటైడర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ చేస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications