చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతి మిస్టరీ: 15 మందికి నోటీసులు, పోయెస్ గార్డెన్ లో విచారణ, ఏం జరిగింది !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చేందుకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి శ్రీకారం చుట్టారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామి సోమవారం పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న 15 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు.

పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారు, భద్రతా సిబ్బందిని విచారించాలని రిటైర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారికి ఇప్పటికే సమన్లు జారీ చేశారు. వారందరూ సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ముందు హాజరుకానున్నారు.

Arumugasamy inquiry Commission begin from today in Chennai

అన్నాడీఎంకే పార్టీ వర్గాలు, తమిళనాడు ప్రజలు అమ్మ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి విచారణ కమిషన్ కు ఆదేశించారు. విచారణ కమిషన్ కు ప్రత్యేక కార్యాలయం, సంబంధిత ఏర్పాట్లు చెయ్యడంలో జాప్యం జరిగింది.

ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సోమవారం రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి రంగంలోకి దిగారు. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటిలో పని చేస్తున్న వారిని మొదట విచారణ చేసి వివరాలు సేకరించాలని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నిర్ణయించారు. వేదనిలయంలో పని చేస్తున్న వారిని రిటైడర్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ చేస్తున్నారు.

English summary
Jayalalitha death mystery case, Justice Arumugasamy Commission issue notice to 15 person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X