జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో దొర్లిన తప్పులు ఇవే..
గృహ నిర్మాణ పథకం గురించి ప్రస్తావించినప్పుడు 30చదరపు మీటర్లకు బదులుగా, 30చదరపు కి.మీ అని జైట్లీ తప్పుగా చదివారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో.. దేశవ్యాప్తంగా దానిపైనే చర్చ జరుగుతోంది. బడ్జెట్ లోటుపాట్లపై, జైట్లీ ప్రస్తావించిన అంశాలపై అటు మీడియా, ఇటు జనం లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దొర్లిన తప్పులపై కూడా పలువురు ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ను పార్లమెంటులో చదివి వినిపిస్తున్న తరుణంలో.. జైట్లీ అక్కడక్కడా తడబాటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన తప్పులను సహచరులు సరిదిద్దారు.

గృహ నిర్మాణ పథకం గురించి ప్రస్తావించినప్పుడు 30చదరపు మీటర్లకు బదులుగా, 30చదరపు కి.మీ అని జైట్లీ తప్పుగా చదివారు. అలాగే ఆదాయపు పన్ను గురించి వివరిస్తున్నప్పుడు.. 1.71లక్షలు అని చెప్పబోయి.. రూ.1.71లక్షలు అని చదివారు. దీంతో స్పీకర్, సహచర సభ్యులు ఆయన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు.
కాగా, నడుం నొప్పితో బాధపడుతున్నందునా.. బడ్జెట్ స్పీచ్ ను జైట్లీ కూర్చొనే చదివారు. ఈ మేరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ జైట్లీకి అనుమతినిచ్చారు.












Click it and Unblock the Notifications