రూ. కోటి లంచం, కోర్టు ముందు అశ్విన్ రావ్
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో జరిగిన అవినీతి కేసులో అరెస్టు అయిన లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ను కోర్టు ముందు హాజరుపరిచారు. కర్ణాటక ప్రభుత్వంలో సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తిని బెదిరించి కోటి లంచం డిమాండ్ చేశారని ఈయన మీద కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ప్రముఖ ముద్దాయి. విచారణకు హాజరుకావాలని ఎస్ఐటి అధికారులు అశ్విన్ రావ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరుకాకుండ హైదరాబాద్ లో ఉండిపోయారు.
ఎస్ఐటి అధికారులు సోమవారం హైదరాబాద్ లో అశ్విన్ రావ్ ను అరెస్టు చేసి రాత్రి 10.45 గంటల సమయంలో బెంగళూరు తీసుకు వచ్చారు. మంగళవారం అధికారులు అశ్విన్ రావ్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన ఇంటికి ఎస్ఐటి అధికారులు వచ్చారని, మద్యాహ్నం 1.30 గంటల సమయంలో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు బెంగళూరు రావాలని చెప్పి ఇన్నోవా కారులో తీసుకు వచ్చారని అశ్విన్ రావ్ న్యాయమూర్తి ముందు చెప్పాడు.
లోకాయుక్త ను అడ్డం పెట్టుకుని లంచం డిమాండ్ చేశారని నమోదు అయిన కేసు ను వాదించడానికి ప్రత్యేక న్యాయవాదిని నియమించారు. జనార్దన్ అనే న్యాయవాదిని ఈ కేసు కోసం నియమించామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రతులను లోకాయుక్త న్యాయస్థానంలో సమర్పించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications