అందమైన మహిళా ఆఫీసర్-కోట్ల రూపాయల అవినీతి- కట్ చేస్తే సీఎంకు..!
Nupur Bora Corruption:అస్సాంలో అవినీతిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అస్సాం పరిపాలనా సేవల (ACS) అధికారిణి నుపూర్ బోరా భూ బదలాయింపు కేసులో అరెస్టయ్యారు. ఆమె నివాసాల్లో కోటి రూపాయల నగదు, వజ్రాలు, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అవినీతి ఆరోపణలు,అరెస్ట్ వివరాలు
ఆరేళ్ల సర్వీసులో ఉన్న యువ బ్యూరోక్రాట్ నుపూర్ బోరా, బార్పేటలో జరిగిన అక్రమ భూ బదలాయింపుల కేసులో సోమవారం అరెస్టయ్యారు. ముఖ్యమంత్రి నిఘా విభాగం గువాహటిలోని గోటానగర్ ప్రాంతంలోని బోరాకు చెందిన రెండు అపార్ట్మెంట్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దాదాపు కోటి రూపాయల నగదుతో పాటు లక్షల విలువైన వజ్రాలు, ఇతర ఆభరణాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. 2019 బ్యాచ్కు చెందిన ACS అధికారిణి బోరా, ప్రస్తుతం కామరూప్ జిల్లాలోని గోరైమారి సర్కిల్ అధికారిణిగా పనిచేస్తున్నారు. ఆమెను ప్రస్తుతం కస్టడీలో ఉంచారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడి:
ఈ అరెస్టులను ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధృవీకరించారు. బోరా తన తెలిసిన ఆదాయ వనరులకు మించి నగదు, ఆస్తులను కూడబెట్టుకుందనే నిర్దిష్ట ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ అధికారిణి బార్పేటలో పోస్ట్ అయినప్పుడు హిందువుల భూమిని వేరే వర్గానికి బదిలీ చేస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు హిమంత వెల్లడించారు. గత ఆరు నెలలుగా ఆమె పై నిఘా ఉందరి సీఎం స్పష్టం చేశారు.
🚨 Assam CM CONFIRMS ACTION against officer Nupur Bora, caught taking crores in bribes to transfer Hindu-owned land to a particular community.pic.twitter.com/Jf5CLdRkoY
— Sunny Raj (@SunnyRajBJP) September 16, 2025
అంతర్-మత భూ లావాదేవీలపై కొత్త SOP:
మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో రెవెన్యూ సర్కిళ్లలో అవినీతి విస్తృతంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఆగస్టు 27న, అస్సాం క్యాబినెట్ అన్ని అంతర్-మత భూ లావాదేవీలకు రాష్ట్ర పోలీసుల స్పెషల్ బ్రాంచ్ క్లియరెన్స్ తప్పనిసరి చేస్తూ కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని ఆమోదించింది. జనాభా మార్పులు, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను దీనికి కారణాలుగా పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనలో అక్రమ వలసదారుల నుండి అస్సాం జనాభాకు ముప్పు ఉందని పేర్కొన్నారు.
కొనసాగుతోన్న విచారణ
పోలీసులు బోరాకు ఆరోపించిన సహచరుడు సురజిత్ దేకా బార్పేట ఇంటితో సహా మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. విచారణ ముగిసేనాటికి మరింత నగదు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఎస్పీ రోసీ కాలితా తెలిపారు. ఇది నిఘా విభాగంలో నమోదైన 25వ కేసు అని ఆమె అన్నారు. ఫ్యాషన్, డెకర్, ప్రయాణాలపై ఆసక్తి ఉన్న బోరా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వాటిని తరచుగా పోస్ట్ చేస్తారు. పోలీసు వర్గాల ప్రకారం, ఆమె గువాహటిలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications