వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం.. అస్సామీలదే..! సీఏఏ వ్యతిరేక హింసపై సిట్.. ఒక్కరినీ వదిలిపెట్టం: సీఎం సోనోవాల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA 2019 : Assam Will Remain With Assamese People || Oneindia Telugu

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల అస్సామీలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, అస్సాం.. ఎప్పటికీ అస్సామీల సొంత రాష్ట్రంగానే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. సీఏఏ, ఎన్సార్సీపై ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఒకవేళ ఏవైనా ఇబ్బందులొస్తే పరిష్కరించడానికి కేంద్రం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అలాగే, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చోటుచేసుకున్న హింసపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.

పౌరసత్వ చట్టం: 18న అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల విధుల బహిష్కరణ, యూజీసీ నెట్ పరీక్ష వాయిదాపౌరసత్వ చట్టం: 18న అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల విధుల బహిష్కరణ, యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

 ఆధారాలతో పట్టుకుంటాం

ఆధారాలతో పట్టుకుంటాం

సీఏఏ చట్టంపై మొదటిగా ఆందోళనలు మొదలైంది అస్సాంలోనే. చట్టం అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో చాలా చోట్ల హింస చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడం లాంటి ఘటనలెన్నో జరిగాయి. వాటికి బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని, ఆధారాలతో సహా దోషుల్ని సిట్ గుర్తిస్తుందని సీఎం సోనోవాల్ చెప్పారు.

ఇంటర్నెట్ సేవలు యథాతథం

ఇంటర్నెట్ సేవలు యథాతథం

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చోటుచేసుకోవడంతో కొత్త ప్రాంతాలకు అది వ్యాంపించొద్దన్న ఉద్దేశంతో అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 11న ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. 16వ తేదీనాటికి మరో 10 జిల్లాల్లో ఇంటర్నెట్ బ్యాన్ వర్తింపజేశారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పరిస్థితులు సర్దుమణిగిన నేపథ్యంలో నెట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అస్సాం అకార్డ్ పై మోదీ, షా మాటిచ్చారు

అస్సాం అకార్డ్ పై మోదీ, షా మాటిచ్చారు

అస్సాంలో విదేశీయుల అక్రమ వలసల్ని ఖరారుచేసే కటాఫ్ తేదీని(మార్చి 24, 1971) గుర్తించే ‘అస్సాం అకార్డ్'లోని ఆరో క్లాజుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కచ్చితమైన హామీ ఇచ్చారని, అస్సాం.. అస్సామీలదేనని చాటిచెప్పుకోడానికి అవసరమైతే మరికొన్ని చట్టాలు తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం సోనోవాల్ చెప్పారు.

English summary
Assam Chief Minister Sarbananda Sonowal said that a Special Investigation Team has been constituted to probe the acts of violence during protests against the Citizenship Amendment Act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X