అసోం సంచలనం: ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి 'నో'
ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే గాక ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త నిబంధన వర్తించనుంది.
దిస్పూర్: ముస్లిం జనాభాను నియంత్రించాలని చేశారో లేక నిజంగా ప్రజా సంక్షేమం కోరి చేశారో తెలియదు గానీ మొత్తానికి అసోం రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో చైనా అనుసరించిన జనాభా పాలసీని తలపించేలా.. అసోం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ఈ పాలసీ మేరకు ఇకనుంచి ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న దంపతులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. అంతేకాదు, మైనారిటీ తీరకుండానే వివాహం చేసుకునేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివాం నాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమం, మాతా శిశుమరణాలను అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త పాలసీని రూపొందించినట్లుగా హిమంత బిశ్వ శర్మ తెలిపారు.అయితే అసోం బీజేపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బెంగాలీ ముస్లింల జనాభాను నియంత్రించేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే గాక ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త నిబంధన వర్తించనుంది. రాష్ట్రంలో సబ్సిడీ కింద ఇస్తున్న ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీ వంటి పథకాలకు ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు అనర్హులవుతారు. నిబంధన ప్రకారం స్థానిక సంస్ఘలు, మున్సిపల్ ఎన్నికల్లోను వారికి అవకాశం ఉండదు.
కాగా, అసోం ప్రస్తుత జనాభా 3.12కోట్లు కాగా, 2011తో పోల్చితే 1కోటి జనాభా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక మహిళా రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే రోజుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ వర్తింపజేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. దీనిపై అప్పుడే తొందర పడబోమని, ఒక్కో అడుగు ముందుకు వెళ్తామని చెప్పారు. జూలై వరకు ప్రజల నుంచి సలహాలు-సూచనలు స్వీకరించి, ఆ తర్వాత దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications