ఉద్యోగానికి వెళ్లిన అసిస్టెంట్ లేడీ కలెక్టర్, జలాశయంలో ఎలా శవమైయ్యింది, రాత్రి హోటల్ లో !
కటక్/ఒడిస్సా: ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలని సమాజంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు తలఎత్తుకుని నిలబడాలని ఓ యువతి కలలుకనింది. అనుకున్నట్లు ఆ యువతి అసిస్టెంట్ కలెక్టర్ గా (collector) మంచి ఉద్యోగం చేస్తోంది. అయితే కార్యాలయానికి వెళ్లిన అసిస్టెంట్ కలెక్టర్ సిటీలోని ఓ జలాశయంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
ఒడిశా పూర్వపు రాజధాని అయిన కటక్ కు (cuttack)చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సస్మిత మింజ్ (35) అనే మహిళ ఉన్నత చదువులు పూర్తి చేసిన తరువాత కటక్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా (collector) ఉద్యోగంలో చేరారు. చాలా చురుగా ఉంటున్న సస్మిత మింజ్ కటక్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లి వస్తోంది.

మా కుమార్తె సస్మిత మింజ్ అసిస్టెంట్ కలెక్టర్ గా (collector) మంచి ఉద్యోగం చేస్తోందని, త్వరలో జిల్లా కలెక్టర్ (cuttack) అవుతుందని ఆమె కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఈనెల 15వ తేదీన ఉదయం సస్మిత మింజ్ (collector) ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లారు. తరువాత ఆరోజు రాత్రి సస్మిత మింజ్ ఇంటికి చేరుకోలేదు. ఫోన్ లో సస్మిత మింజ్ ను ఆమె కుటుంబ సభ్యలు సంప్రదించారు.
ఈనెల 17వ తేదీన కటక్ (cuttack) నగరంలోని ఓ హోటల్ (hotel) లో సస్మిత మింజ్ ఉన్నారని తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు హోటల్ (hotel) లోకి వెళ్లి అసిస్టెంట్ కలెక్టర్ ను (collector) కలవడానికి ప్రయత్నించారు. అయితే తాను ఆఫీసు ఒత్తిడితో చాలా సతమతం అవుతున్నానని, తనకు విశ్రాంతి అవసరం అని, తాను ఎవ్వరిని కలవను అని సస్మిత మింజ్ ఆమె తల్లి, సోదరుడికి తేల్చి చెప్పడంతో వారు హోటల్ లో (collector) నుంచి బయటకు వెళ్లిపోయారని తెలిసింది.
కటక్ (cuttack)నగరంలోని సెంచరీ పార్క్ సమీపంలోని ఓ జలాశయంలో మహిళ శవం తేలుతున్న విషయం గుర్తించిన పార్క్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జలాశయంలోని మహిళ శవాన్ని (collector) బయటకు తీసి పరిశీలించారు. జలాశయం సమీపంలో పడి ఉన్న వ్యానిటీ బ్యాగ్, చెప్పులు పడి ఉండటంతో పోలీసులు వాటిని పరిశీలించారు.

జలాశయంలో శవమై కనిపించింది అసిస్టెంట్ కలెక్టర్ (collector) సస్మిత మింజ్ అని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. సీనియర్ అధికారులు తమ కుమార్తెను మానసికంగా వేధింపులకు గురి చేశారని, చాలా కాలం నుంచి నిత్యం ఆమెను టార్చర్ పెడుతున్నారని, తమ కుమార్తెను హత్య చేసి శవాన్ని జలాశయంలో విసిరేశారని సస్మిత మింజ్ తల్లి
(mother) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజగంగపూర్ ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ కలెక్టర్ (collector) సస్మిత మింజ్ ఆత్మహత్య చేసుకున్నారా ?, హత్యకు గురైనారా ? అని ఆరా తీస్తున్న కటక్ నగర పోలీసు కమీషనర్ మీడియాకు చెప్పారు. అసిస్టెంట్ మహిళా కలెక్టర్ (collector) సస్మిత మింజ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఓడిశాలో కలకలం రేపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications