కుప్పకూలిన పుట్బాల్ గ్యాలరీ: 200 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం (వీడియో)
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మలప్పురం జిల్లా పూంగోడ్లో శనివారం రాత్రి ఆల్ ఇండియా సెవన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 8000 మంది వచ్చారు. దీంతో స్టేడియం మొత్తం కిక్కిరిసి పోయింది.

గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షుకులు కూర్చోవడంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో అందులో కూర్చున్నవాళ్లంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీ చుట్టుపక్కల మూడు వేల మంది వరకు ఉన్నారు.
సెవన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. సరిగ్గా ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోయింది. దీంతో అంతా ఉలిక్కి పడ్డారు. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications