బెంగళూరులో ఏటీఎం డబ్బు: రూ. 90 లక్షలతో పరారైన సిబ్బంది, గన్ మ్యాన్ కు చెప్పి!
బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో సారి ఏటీఎంలో నగదు నిల్వచెయ్యడానికి బయలుదేరిన సిబ్బంది ఆ నగదుతో సహ పరారైన ఘటన జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూ. 90 లక్షలతో సహ వాహనంతో పరారైన నిందితుల కోసం పొలీసులు గాలిస్తున్నారు.
మంగళవారం జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలో ఉన్న ఏటీఎంలో నగదు నిల్వచెయ్యడానికి సీఎంఎస్ సంస్థ సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ నారాయణస్వామి, ఉద్యోగి నరసింహరాజు, గన్ మ్యాన్ అక్కడ ఉన్నారు. తరువాత గన్ మ్యాన్ ను పిలిచి అరటిపండ్లు తీసుకురావాలని చెప్పారు.

గన్ మ్యాన్ అరటి పండ్లు తీసుకు వచ్చి చూడగా వాహనంతో సహ నారాయణస్వామి, నరసింహరాజు మాయం అయ్యారని గుర్తించాడు. వాహనం కనపడకపోవడంతో గన్ మ్యాన్ సీఎంఎస్ సంస్థ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఏటీఎం కేంద్రం పరిసర ప్రాంతాల్లోని సీసీకెమెరాలు పరిశీలించి రూ. 90 లక్షలతో సహ మాయం అయిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బెంగళూరు నగరం నుంచి నగదు, వాహనం, నిందితులు బయటకు వెళ్లకుండా నాకాబంధి చేస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications