వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరట :ఎటిఎంల నుండి నగదు 'విత్ డ్రా 'ల పరిమితి పెంపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎటిఎంల నుండి నగదు పరిమితిని పెంచుతూ ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఎటిఎంల నుండి ప్రతిరోజూ నాలుగు వేల ఐదువందల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది.నాలుగువేల ఐదువందల నుండి పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది ఆర్ బిఐ.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలు, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది ఆర్ బి ఐ. అయితే నగదు ఉపసంహరణపై ఆంక్షలను సోమవారంనాడుసాయంత్రం ఎత్తివేస్తూ ఆర్ బి ఐ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపింది.

atm

ప్రస్తుతం ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణను ప్రతి రోజూకు పదివేలకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకొన్నారు. కరెంట్ ఖాతాల నుండి వారానికి లక్ష రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుతం కరెంట్ ఖాతాల నుండి వారానికి యాభై వేల రూపాయాలను మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం మాత్రమే ఉంది.

సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి నగదు ఉపసంహరణలో మార్పులు లేవు. అయితే వారానికి సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి 24 వేల రూపాయాలు మాత్రమే ఇప్పటివరకు డ్రా చేసుకొనే అవకాశం ఆర్ బి ఐ కల్పించింది.

English summary
rbi extend cash withdraw from atms 4500 to 1000 rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X