ఊరట :ఎటిఎంల నుండి నగదు 'విత్ డ్రా 'ల పరిమితి పెంపు
న్యూఢిల్లీ : ఎటిఎంల నుండి నగదు పరిమితిని పెంచుతూ ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఎటిఎంల నుండి ప్రతిరోజూ నాలుగు వేల ఐదువందల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది.నాలుగువేల ఐదువందల నుండి పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది ఆర్ బిఐ.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలు, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది ఆర్ బి ఐ. అయితే నగదు ఉపసంహరణపై ఆంక్షలను సోమవారంనాడుసాయంత్రం ఎత్తివేస్తూ ఆర్ బి ఐ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపింది.
ప్రస్తుతం ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణను ప్రతి రోజూకు పదివేలకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకొన్నారు. కరెంట్ ఖాతాల నుండి వారానికి లక్ష రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుతం కరెంట్ ఖాతాల నుండి వారానికి యాభై వేల రూపాయాలను మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం మాత్రమే ఉంది.
సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి నగదు ఉపసంహరణలో మార్పులు లేవు. అయితే వారానికి సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి 24 వేల రూపాయాలు మాత్రమే ఇప్పటివరకు డ్రా చేసుకొనే అవకాశం ఆర్ బి ఐ కల్పించింది.