Aunty sketch: పెళ్లిలో బాలిక కిడ్నాప్, రేప్. 33 ఏళ్లకు ఆంటీకి షాక్, ప్రియుడు కోరిక తీర్చాలని !
చెన్నై/ బెంగళూరు: ఎంతో నమ్మకంగా తమ దగ్గర ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంటీకి ఊహించని షాక్ ఎదురైయ్యింది. కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులో ప్రియుడితో పాటు నిందితులకు సహాయం చేసిన ఆంటీకి కోర్టు సరైన శిక్ష వేసింది. 33 ఏళ్ల పాటు హ్యాపీగా ఉంటున్న ఆంటీ ఈ రోజు జైలుకు వెళ్లింది. రేప్ కేసులోని నిందితులు వివిద కారణాలతో చనిపోయినా నమ్మద్రోహంతో అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకు తీవ్ర ద్రోహం చేసిన ఆంటీ మాత్రం ఆ కేసు నుంచి తప్పించుకోలేకపోయింది.
Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !
33 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే ?
1988 జూన్ 30వ తేదీన షరావతి సమీపంలోని గ్రామంలో జరుగుతున్న వివాహానికి 12 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లి వెళ్లారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న తల్లి ఆమె 12 ఏళ్ల కుమార్తెను మీ దగ్గర పెట్టుకోవాలని రమావతి, ఆమె తల్లి పూల్ మాతాకు చెప్పింది. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటామని రమావతి, ఆమె తల్లి పూల్ మాతా అమ్మాయి తల్లికి చెప్పారు.
అమ్మాయి ముఖాన్ని టవల్ తో చుట్టేసి కిడ్నాప్
బాలిక మీద అదే గ్రామంలో నివాసం ఉంటున్న ముక్కు, పుస్సు, లహరీ అనే ముగ్గురు కామాంధులు స్కెచ్ వేశారు. ఈ ముగ్గురిలో ఒకరితో రమావతికి అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. బాలిక మీద కన్ను వేసిన కామాంధులకు రమావతి సహకరించింది. బాలిక ముఖాన్ని టవల్ తో చుట్టేసి ఆమె కేకలు వెయ్యకుండా నోరు నొక్కేసి పెళ్లి ఇంట్లో కిడ్నాప్ చేశారు.
రేప్ చేసి ఎస్కేప్
బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు ముక్కు, పుస్సు, లహరీ ఆమెను నిర్జనప్రదేశంలోని తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారైనారు. తరువాత బాలిక ఆమె తల్లికి విషయం చెప్పింది. బాధితులు స్థానిక బింగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇదే కేసులో కిలాడీ రమావతి, ఆమె తల్లి పూల్ మాతా, కామాంధులు ముక్కు, పుస్సు, లహరీని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొంతకాలం తరువాత నిందితులు అందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.
ఆంటీ తప్పించుకోలేకపోయింది
12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశారని నమోదు అయిన కేసు అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని నేరం రుజువు అయ్యింది. కామాంధులకు బాలికను రమావతి అప్పగించిందని నేరం రుజువు అయ్యింది. రేప్ చెయ్యడానికి సహకరించిన రమావతికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించామని న్యాయమూర్తి పరమేశ్వర ప్రసాద్ సంచలన తీర్పు చెప్పారు. బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధులు ముక్కు, పుస్సు, లహరీ ఇప్పటికే వివిధ కారణాలతో మరణించారని, ఇది ఒక పాత కేసు అని, ఇప్పటికి బాధితులకు న్యాయం జరిగిందని ప్రభుత్వ కౌన్సిల్ కేపీ సింగ్ మీడియాకు చెప్పారు.
Recommended Video