ప్రియుడి కోసం కన్న కొడుకునే చంపేసిన ఆంటీ, అక్క కొడుకుతో కలిసి ?, అంతేనా !
బెంగళూరు/బెళగావి: ఫ్యామిలీ సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. భార్యతో ఉంటే మొదటికే మోసం వస్తుందని అనుకున్న భర్త ఆమెను వదిలించుకున్నాడు. భర్తను వదిలేసిన ఆంటీ మరో ప్రియుడిని సెట్ చేసుకోవడం, ఆంటీ అక్కలు కూడా అక్రమ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
తన తల్లి అక్రమ సంబంధాన్నిప్రశ్నించిన కొడుకు దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని రాయబాగ్లో చోటుచేసుకుంది, ఈ ఘటనకు సంబంధించి ఓ మైనర్ బాలుడితో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

రాయబాగ్ పట్టణంలోని నవీ గల్లికి చెందిన హరిప్రసాకు చెందిన సంతోష్ భోసలే (22) అనే యువకుడు హత్యకు గురైనాడు.
హత్యకు గురైన యువకుడి తల్లి సుధా అలియాస్ మాధవి బోసాలే (45). కొల్హాపూర్ జిల్లా కరవీర్ తాలూకా సింగనాపూర్ గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు కుమార్ బబలేశ్వర్ (40), సుధా అక్క వైశాలి మానె (40), హత్యకు సహకరించిన సుధా పెద్ద అక్క కుమారుడు గౌతమ్ మానె (35), హత్యకు కుట్ర చేసిన సంతోష్ ను పిలుచుకుని వెళ్లిన ఓ మైనర్ బాలుడిని రాయ్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు.
భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి సుధా బోసాలే వేరే ఊళ్లో నివాసం ఉంటున్నది. స్టీల్ సామన్ల దుకాణం పెట్టుకున్న సుధా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ సమయంలో కుమార్ బబలేశ్వర్ తన దుకాణం నుంచి తనకు కావాల్సిన పాత్రలు కొనుగోలు చేస్తూ మాధవి మేడమ్ తో చనువు పెంచుకున్నాడు. తర్వాత మాధవి, కుమార్ ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
తల్లి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న కుమారుడు సంతోష్ బోసాలే తల్లిని హెచ్చరించారు. మేము పెళ్లి చేసుకుని భార్యలతో కాపురం చెయ్యాల్సిన సమయంలో నువ్వు ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావా ?, నీకు ఎంత ధైక్యం ఉంటే ఇలా చేస్తావు, పద్దతి మార్చుకోకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని సంతోష్ అతని తల్లిని హెచ్చరించాడు.

ఇంత జరిగినా సుధా బోసాలే ఆమె ప్రియుడు కుమార్ తో అక్రమ సంబంధం కొనసాగించింది. దీంతో ఆమె కొడుకు సంతోష్ మనస్తాపం చెంది గొడవకు దిగాడు. కొడుకు సంతోష్ తో వాదన రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆగ్రహించిన సుధా భయపడిపోయింది. తరువాత మహారాష్ట్రలోని కొల్లాపూర్లో నివాసం ఉంటున్న అక్క వైశాలి, ఆమె కొడుకు గౌతమ్లకు ఫోన్ చేసి రాయబాగ్కు రమ్మని చెప్పింది. అదేరోజు రాత్రి నిద్రిస్తున్న కుమారుడు సంతోష్ ను హత్య చేసింది.
తెల్లవారుజామున గుండెపోటుతో తన కుమారుడు సంతోష్ మృతి చెందినట్లు మాధవి చుట్టుపక్కల వారిని నమ్మించి అంత్యక్రియలు చెయ్యడానికి ప్రయత్నించింది. ఇరుగుపొరుగు వారు కూడా దీనిని నమ్మారు. మాధవి భర్తకు అతని కుమారుడు సంతోష్ చనిపోయాడని తెలిసింది. తన కుమారుడు సంతోష్ గుండెపోటుతో చనిపోలేదని, నా భార్య మాధవి అక్రమ సంబంధం కారణంగానే అతను హత్యకు గురైనాడని ఆరోపిస్తూ కేసు పెట్టాడు.

పోలీసులు ఇంటికి వచ్చి చూడగా సంతోష్ మెడ మీద గాయాలు కనిపించాయి. అనంతరం అనుమానం వచ్చిన పోలీసులు సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంతోష్ ది సహజ మరణం కాదని, అతను హత్యకు గురైనాడని నివేదిక ఇవ్వడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సుధా బోసలేను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈసారి మాధవి ఆమె ప్రియుడు, బంధువులతో కలిసి తన కుమారుడు సంతోష్ ను హత్య చేశామని అంగీకరించడతో పోలీసులతో పాటు స్థానికులు హడలిపోయారు, కామంతోతో కళ్లుమూసుకుపోయిన మాధవి ఆమె కుమారుడికి పెళ్లి చెయ్యకుండా ఆమె ప్రియుడిని సెట్ చేసుకోవడం, అడ్డుపడుతున్న కొడుకు సంతోష్ ను హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆ తర్వాత వైశాలి, ఆమె కుమారుడు గౌతమ్, మాధవి ప్రియుడు కుమార్, హత్యకు సహకరించిన ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications