Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య రామమందిరంలో కాశ్మీరీ వ్యక్తి నమాజ్..?

అయోధ్యలోని రామమందిరం కాంప్లెక్స్ లో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కాశ్మీరీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నమాజ్ చేసేందుకు ప్రయత్నించగా భక్తులు నినాదాలు చేసిన నేపథ్యంలో అక్కడి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అయోధ్యలోని రామమందిరం హిందువులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. నిత్యం లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే తాజాగా కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి అయోధ్యలోని రామమందిరం కాంప్లెక్స్ లో నమాజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఇది చూసిన అక్కడి భక్తులు అతడ్ని అడ్డుకుంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నిందితుడు కాశ్మీర్‌ లోని షోపియాన్ జిల్లాకు చెందిన 55ఏళ్ల అహ్మద్ షేక్‌ గా పోలీసులు గుర్తించారు. అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, దర్శనం తర్వాత సీతా రసాయి ప్రాంతం వద్ద నమాజ్ చేయడానికి సిద్ధమవుతుండగా అతన్ని స్థానిక భక్తులు గుర్తించారు. అహ్మద్ షేక్‌ చర్యలను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.

వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని.. విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి నినాదాలు చేశాడని కొన్ని వర్గాలు పేర్కొన్నప్పటికీ, అధికారులు ధృవీకరించలేదు. దర్యాప్తు, నిఘా ఏజెన్సీలు అతని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నాయి.

అతను అయోధ్యకు ఎందుకు వచ్చాడు..? ఇతరుల ప్రమేయం ఉందా..? అనే దానిపై అధికారులు అహ్మద్ షేక్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక తనిఖీలలో అతని వద్ద జీడిపప్పు, ఎండు ద్రాక్ష లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తాను అజ్మీర్ వెళుతున్నట్లు దర్యాప్తు అధికారులకు అహ్మద్ షేక్‌ చెప్పినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటన నేపథ్యంలో రామమందిర సముదాయంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీసు అధికారులు, నిఘా ఏజెన్సీలు సమీక్షిస్తున్నాయి. అయితే జిల్లా యంత్రాంగం, రామమందిర ట్రస్టు ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

Ayodhya Shocker Kashmiri Man Detained for Attempting Namaz Inside Ram Temple Complex

మరోవైపు మకర సంక్రాంతి ఉత్సవాలకు అయోధ్య సిద్ధమవుతోంది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన ఉత్సవం రెండో వార్షికోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+