వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ayodhya verdict:1934లో అల్లర్లు, 1949లో ఆటంకాలు.. అయోధ్య తీర్పులో ప్రస్తావించిన రాజ్యాంగ ధర్మాసనం

|
Google Oneindia TeluguNews

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు చాలా అంశాలను వివరించింది. అయోధ్య భూమికి సంబంధించి 1934 అల్లర్లు, 1949 ఆటంకాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇంతకీ 1939, 1949లో ఏం జరిగింది. తన తీర్పులో సుప్రీంకోర్టు ఏ అంశాలను వివరించింది. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..? Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..?

15వ శతాబ్ధం నుంచి వివాదం..

15వ శతాబ్ధం నుంచి వివాదం..

అయోధ్య భూ వివాదం శతాబ్ధాల నుంచి ఉంది. 1528లో బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ మసీదును నిర్మించాడు. తర్వాత హిందువులు రాముని విగ్రహాం ఉందని పూజలు కూడా చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. 1934లో అయోధ్యలో ఉన్న మసీదు దెబ్బతినడంతో వివాదం చెలరేగింది.

ఇదీ కారణం..

ఇదీ కారణం..

గోవుల వల్ల మసీదు కాస్త దెబ్బతింది. ఈ విషయాన్ని కొందరు ప్రభుత్వానికి తెలియజేశారు. బ్రిటిష్ ప్రభుత్వం హిందువులకు జరిమానా విధించింది. రూ.84 వేల పెద్దమొత్తం కట్టాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఓ హిందు మహిళ ఆ నగదు కట్టడంతో గొడవ సద్దుమణిగింది. రూ.84 వేల నగదును దెబ్బతిన్న మసీదును పునర్ నిర్మించేందుకు ఉపయోగించారు.

రాముని విగ్రహాం

రాముని విగ్రహాం

తర్వాత 1949లో రాముని విగ్రహాన్ని అయోధ్య మందిరం మధ్యలో పెట్టారు. కానీ దానిని ఎవరో తీసేశారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై రామ్ దేవ్ పేర్కొన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఫైజాబాద్ మేజిస్ట్రేట్ మార్కండేయ్ సింగ్ సీఆర్పీసీ 145 సెక్షన్ కింద నోటీసులు జారీచేశారు. అనుమానం ఉన్న హిందువులు, ముస్లింలు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు.

తెరపైకి నిర్మోహి అకాడా..

తెరపైకి నిర్మోహి అకాడా..

ఇక 1950 నుంచి అయోధ్య వివాదాస్పద స్థలంలో విగ్రహాలు పెట్టడం ప్రారంభించారు. దీనిని ఆధారంగా చేసుకొని నిర్మోహి అకాడా కేసు నమోదు చేసింది. మసీదు కన్నా ముందు ఇక్కడ ఆలయాలు ఉండేవని చెప్పారు. తర్వాత అకాడా రంగంలోకి దిగడంతో సున్నీ వక్ఫ్ బోర్డ్ కూడా పిటిషన్ వేసింది. బాబ్రీ మసీదు స్తలాన్ని తమకు అప్పగించాలని కోరింది. అప్పటి నుంచి రామజన్మ భూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై వివాదం కొనసాగుతుంది.

English summary
Chief Justice Ranjan Gogoi, recognised that possession of the disputed land was “a matter of contestation” given the riot of 1934 and disturbances in 1949.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X