2.77 ఎకరాల్లో మసీదు నిర్మాణమేమీ లేదు: సుప్రీంకోర్టు
అయోధ్య వివాదాస్పద భూమిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తోంది. తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ చదివి వినిపిస్తున్నారు. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంపై నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తున్నారు. ఇదే అంశంపై షియా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
2.77 ఎకరాల భూమిలో ఖాళీగా ఉన్న స్థలంలో మసీదు నిర్మించలేదని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. అందులో మసీదు నిర్మాణానికి సంబంధించి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పురావస్తు శాఖ తెలిపిందని గుర్తుచేశారు.
ఇస్లాంకు సంబంధించి ఆధారాలు ఏవీ లభించలేదని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో 12వ శతాబ్ధంలో ఆలయం ఉన్నట్టు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నది. అయితే కళాఖండాలు ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొన్నారని మాత్రం గుర్తుచేసింది. ఎన్నో ఎళ్ల నుంచి ఉన్న సున్నితమైన సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపించింది.