విభజన: చిద్దూ సహా అగ్రనేతలకు కోర్టు వారంట్లు
అనంతపురం: రాష్ట్ర విభజనలో పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా పరిగణించి ఒక ప్రాంతానికి అన్యాయం చేశారంటూ వేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, మాజీ కేంద్ర మంత్రులకు అనంతపురం ఫ్యామిలీ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
మల్లికార్జున, నాగన్న అనే అనంతపురం జిల్లా న్యాయవాదులు రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ అగ్రనేతలపై అనంత కోర్టులో ఈ అంశానికి సంబంధించి కేసు వేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోపాటు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, వీరప్పమొయిలీ, గులాం నబీ ఆజాద్, చిదంబరం, కె.సాంబశివరావు, జయపాల్రెడ్డి పేర్లను ఇందులో చేర్చారు.

ఈ కేసును విచారించిన అనంతపురం ఫ్యామిలీ కోర్టు వారందరికీ సమన్లు జారీ చేసింది. అయితే వీరిలో షిండే, ఆజాద్, చిదంబరం సమన్లు అందుకున్నప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది.
ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విజయకుమార్ ఆ ముగ్గురికీ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications