పండగ తెచ్చిన ముప్పు: అమెజాన్, ఫ్లిప్కార్టులపై నిషేధం విధిస్తారా..?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్టులు భారీ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించాయి. దీంతో తమ వ్యాపారాలకు దెబ్బపడుతోందంటూ ఆ రెండు ఈ-కామర్స్ సైట్ల పై నిషేధం విధించాలంటూ భారత వాణిజ్య సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు ఈ రెండు సంస్థలు విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఫిర్యాదు చేసింది.

పండగ సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు
దశరా, దీపావళి సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు ప్రతి ఏటా భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి అక్టోబర్లో ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాల్మార్ట్ గ్రూపునకు చెందిన ఫ్లిప్కార్ట్ సంస్థ భారీ ఆఫర్లను సెప్టెంబర్ 29 నుంచి పెట్టనుంది. అయితే అమెజాన్ తన ఆఫర్ల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఫ్యాషన్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు భారీ ఆఫర్లు ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు ప్రకటించనున్నాయి.

విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి
10శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడం ద్వారా అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ సంస్థలు అవే వస్తువులను అమ్మకానికి పెట్టిన ఇతర వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించింది. ఇందుకోసమే ఆ రెండు సంస్థలపై విచారణ చేయాలని ఆ రెండు కంపెనీలు విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ పేర్కొన్నారు.
Recommended Video

గతేడాది నిబంధనలను సవరించిన కేంద్రం
ఇదిలా ఉంటే గతేడాదే కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ నిబంధనలను మార్చింది. ఈ -కామర్స్ ఇస్తున్న భారీ ఆఫర్లతో ఇతర అసంఘటిత రీటెయిల్ రంగంకు చెందిన వ్యాపారులు ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఇచ్చే భారీ ఆఫర్లతో పోటీ పడి ఆఫర్లు ఇవ్వలేకపోతున్నారని కేంద్రం పేర్కొంది. అంతేకాదు వీరు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల యాజమాన్యాలు ఆలోచించి వారి స్ట్రక్చర్లో కొన్ని మార్పులు చేశాయి. ఇక ఈ ఆఫర్ల ద్వారా దాదాపు 5 లక్షల మంది అమ్మకందారులు వారి ఉత్పత్తులు సేల్ చేసేందుకు తమ ప్లాట్ఫామ్ను వినియోగించుకుంటున్నారని అమెజాన్ సంస్థ పేర్కొంది. ఇక తమ సంస్థ భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడే పనిచేస్తోందని ఎక్కడా ఉల్లంఘించలేదని అమెజాన్ స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications