బెంగళూర్ రేప్: స్కూల్ చైర్మన్ అరెస్టు, ఆందోళనలు
బెంగళూర్: ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పాఠశాల చైర్మన్ను బుధవారంనాడు అరెస్టు చేశారు. ఈ నెలారంభంలో విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై బెంగళూర్లో రోజు రోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి.
నిందితులను కాపాడుతున్నారంటూ ఆందోళనకారులు పాఠశాల యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బుధవారం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దారుణమైన అత్యాచార సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు.

కాగా, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు చదువు కొనసాగడానికి పాఠశాలను తెరవాలని అవసరం ఉందని వారంటున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచే యాజమాన్యం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పాఠశాల 2007 జూన్లో ప్రారంభమైంది. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ స్కూల్గా దాన్ని ప్రకటించారు. దాంతో తల్లిదండ్రులు పెద్ద యెత్తున తమ పిల్లలను చేర్పించారు. దానికి ఐసిఎస్ఇ స్కూల్గా వచ్చే ఏడాది నుంచి నడపడానికి మాత్రమే అనుమతి ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
-
పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications