45 రోజుల్లో ఏడుగురు గర్ల్స్ను వేధించాడు, షాకిచ్చారు

సదరు టీచర్ తమకు అవసరం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా విద్యార్థినిని వేధిస్తున్నారనే కారణంతో స్కూల్ నుండి ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. పాఠశాలను కొన్ని రోజులు మూసివేశారు. అయితే, పాఠశాలను తిరిగి ప్రారంభించండతో స్థానికులు మండిపడ్డారు.
విద్యార్థులను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ను పాఠశాలలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. గత 45 రోజులుగా ఏడుగురు మూడు, నాలుగో తరగతి బాలికలను అతను వేధించాడని ఆరోపించారు. కాగా, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ పేరు చంద్రమౌళి. అతను గతంలో పోస్ట్మ్యాన్గా పని చేశాడు. పదవి విరమణ అనంతరం అతను పాఠశాలలో చేరాడు. అతని వయస్సు 67.












Click it and Unblock the Notifications