క్షవరం చేయనన్నందుకు కాల్చి చంపేశారు
బులంద్షహర్: క్షవరం చేయలేదన్న కారణంతో ఓ వ్యక్తి బార్బర్(మంగళి)ను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢకర్ అనే గ్రామంలో షారుఖ్ అనే వ్యక్తి కటింగ్ సెలూన్ను నడుపుకుంటున్నాడు.
కాగా, సలీం అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కటింగ్ కోసం అతని షాపునకు వెళ్లారు. వీరంతా మొదట తమకంటే తమకే ముందుగా క్షవరం చేయాలని షారుఖ్ను ఇబ్బంది పెట్టారు.

ముగ్గురు వ్యక్తుల తీరుతో విసుగెత్తిన షారుఖ్.. ఎవరికీ కటింగ్ చేయనని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో షారుఖ్పై కాల్పులు జరిపాడు.
తీవ్రగాయాలైన షారుఖ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఖుర్జా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications