బెంగళూరులో వాలిపోయిన 5 అంతస్తుల పీజీ హాస్టల్, అద్దెల కోసం ఆరాటం, జీవితాలతో చెలగాటం, ఢమాల్ !
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిదిలోని హెబ్బాళలోని కెంపాపుర ఓ పక్కకు వాలిపోయిన ఐదు అంతస్తుల పీజీ కట్టడం (పేయింగ్ గెస్ట్) కట్టడం నేలమట్టం చేసే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా 5 అంతస్తుల పీజీ కట్టడం ఉన్న పరిసర ప్రాంతాల్లోని 150 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అద్దె ఎక్కువ వస్తుందని ఆరాటంతో ఆత్రుగా కట్టడం నిర్మించారని, అద్దెకు ఉంటున్న ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని, అందుకే ఆ భవనం పక్కకు వాలిపోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

ఉదయం వాలిపోయి 5 అంతస్తుల భవనం
బెంగళూరు నగరంలోని హెబ్బాళలోని కెంపాపురలోని జి. రామయ్య లేఔట్ లో నిర్మించిన 5 అంతస్తుల పీజీ కట్టడం ఉదయం వాలిపోయింది. పీజీలో నివాసం ఉంటున్న సుమారు 30 మంది ఉద్యోగులు విషయం తెలుసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే బీబీఎంపీ మేయర్ గౌతమ్ కుమార్, బీబీఎంపీ కమిషనర్ బీహెచ్. అనిల్ కుమార్, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

చుట్టు పక్కల భవనాలకు హాని !
పక్కకు వాలిపోయిన 5 అంతస్తుల పీజీ కట్టడం నేలమట్టం చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. చుట్టుపక్కల నిర్మించిన భవనాలకు హాని జరగకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐదు అంతస్తుల పీజీ భవనంలో నివాసం ఉంటున్న వారిని అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

పునరావాస కేంద్రం
పక్కకు వాలిపోయిన 5 అంతస్తుల పీజీ భవనం చుట్టుపక్కల నివాసం ఉంటున్న సుమారు 150 మందిని పునారావాస కేంద్రం ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా అక్కడికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి మూడుపూట ఆహారం అందిస్తున్నామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

పక్కన 8 అడుగుల పునాది తీస్తే !
ఐదు అంతస్తుల పీజీ కట్టడం నిర్మించిన స్థలం పక్కనే మరో భవనం నిర్మించడానికి సుమారు 8 అడుగుల లోతులో పునాది తీశారని, అందుకే పక్కనే నిర్మించిన 5 అంతస్తుల భవనం పక్కకు వాలిపోయిందని బీబీఎంపీ ఇంజనీర్లు అంటున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పక్కన 8 అడుగుల గుంత తియ్యడానికి అనుమతి ఇచ్చిన బీబీఎంపీ అధికారులు ఎవరు ? అని ఆరా తియ్యాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భవనం నేలపట్టం చేస్తున్న సందర్బంగా పక్కన నివాసం ఉంటున్న వారు గ్యాస్ కనెక్షన్ లు వెంటనే తొలగించాలని బీబీఎంపీ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు స్థానికులకు మనవి చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications