జయ మృతిపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్య ఏమన్నారంటే !
లిక్కర్ కింగ్ విజయ్ మాల్య జయలలిత ఆకస్మిక మృతిపై స్పందించారు. జయలలిత అస్తమించారని తెలసుకుని చాల ఆవేదన చెందానని అన్నారు. జయలలిత అనంతలోకాలకు వెళ్లిపోయి తమిళ ప్రజలకు శోకాన్ని మిగిల్చారని చెప్పారు.
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తప్పి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
బ్యాంకులకు రుణం ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్య జయలలిత ఆకస్మిక మృతిపై స్పందించారు. జయలలిత అస్తమించారని తెలసుకుని చాల ఆవేదన చెందానని అన్నారు.
Very saddened about Amma's sad demise. She was one of the most cultured, well mannered and well spoken politicians I ever met. RIP Amma.
— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2016
జయలలిత అనంతలోకాలకు వెళ్లిపోయి తమిళ ప్రజలకు శోకాన్ని మిగిల్చారని చెప్పారు. రాజకీయ నాయకురాలు అంటే జయలలిత అని ఆమెను పొగిడారు. జయలలిత ఆత్మ శాంతించాలని మాల్యకొరుకున్నారు. జయలలితకు శశికళ నటరాజన్, పన్నీర్ సెల్వం కుటుంబ సభ్యులని, వారికి ఆదేవుడు అండగా ఉండాలని, జయలలితకు ఇవే నా నివాళులు అని ట్విట్టర్ లో తెలిపారు.
Condolences to Ms Sasikala and to the new CM Thiru Paneerselvan ....both like family members to late Amma. May God give you strength.
— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2016
అయితే విజయ్ మాల్య ట్విట్లు చేసిన తరువాత అనేక మంది ఆయనకు సోషల్ మీడియాలో జోకులతో ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు త్వరగా డబ్బులు తీసుకుని భారత్ వచ్చేయాలని ఒకరు, ఇలాంటి సమయంలో నైనా భారత్ వచ్చి జయలలితకు నివాళులు అర్పించాలని ఒకరు, మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే మీకు ఇలాగే అందరూ గౌరవం ఇస్తారని మరి కొందరు పలు విధాలుగా ట్విట్లు చేశారు.