దీదీ రాజ్యంలో బీజేపీ ఎంపీ నిరసన: రోడ్డు మీద కూర్చొని ఆందోళన, ఎందుకంటే...?
పశ్చిమబెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. కరోనా వైరస్ వచ్చిన ఆపత్కాలంలో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బెంగాల్లో బీజేపీ నేతలకు స్థానిక ప్రభుత్వం, పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా దక్షిణ దినాజ్పూర్ ఎంపీ సుకాంత మజుందార్కు కూడా తప్పలేదు. ఆయన నియోజకవర్గానికి వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతివ్వకపోవడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.
కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తన నియోజకవర్గానికి వెళ్లేందుకు మజుందార్ ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అసహనానికి గురయ్యాడు. ఎందుకు తనను అడ్డుకున్నారో తెలియజేయాలని స్థానిక పోలీసుస్టేషన్కు లెటర్ కూడా రాశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీదీ సర్కార్ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. ఓ ఎంపీ రోడ్డుపై కూర్చొని ఆందోళన చేయడం చర్చకు దారితీసింది.

Recommended Video
మరో బీజేపీ ఎంపీ జాన్ బార్లాను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధలను ఎంపీ తుంగలో తొక్కారని హౌస్ అరెస్ట్ చేశారు. అంతలోనే మజుందార్కు కూడా అనుమతివ్వలేదు. బెంగాల్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఆదివారం బీజేపీ నేతలు ఆందోళనకు కూడా దిగారు. కానీ తనను తన నియోజకవర్గానికి వెళ్లనీయకపోవడం మాత్రం సరికాదని మజుందార్ అంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications