బాంబు పేలుడు: సీసీ కెమెరాలో నిందితుడు (వీడియో)
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుడు కేసులో అనుమానిత ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. అతను బ్యాగ్ తో ఆ ప్రాంతంలో పలు సార్లు అనుమానాస్పదంగా సంచరించాడని అధికారులు చెప్పారు.
బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో అతను అనుమానాస్పదంగా సంచరించిన దృశ్యాలు గుర్తించారు. 2014 డిసెంబర్ 28వ తేది రాత్రి 8.32 గంటల సమయంలో చర్చిస్ట్రీట్ లోని కోకోనెట్ గ్రోవ్ రెస్టారెంట్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది.
బెంగళూరు పోలీసులు మొదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ లోని ఎన్ఐఏ అధికారుల ప్రత్యేక బృందం కేసు విచారణ చేస్తున్నది.

ఎన్ఐఏ అధికారులు సీసీ టీవీ కెమెరాలోని క్లిప్పింగ్స్ పరిశీలించారు. నీలి రంగ టీ షర్టు, తలకు క్యాప్ వేసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రి 7 గంటల నుంచి పలు సార్లు ఆ ప్రాంతంలో సంచరించాడని అధికారులు వెల్లడించారు.
అతని దగ్గర ఓ బ్యాగ్ ఉందని, అందులోనే బాంబు తీసుకువచ్చిపెట్టాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ బాంబు దాడిలో చెన్నైకి చెందిన ఓ మహిళ మరణించింది. నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 5 లక్షలు బహుమానం ఇస్తామని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications