Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీకి ఈగతి పడుతుందని 2021లోనే స్వామీజీ శాపనార్తాలు, అక్షరాల నిజం అయ్యింది !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలో 2019 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని అనుకున్న బీజేపీ హైకమాండ్ ఆశలు ఆవిరి అయిపోయాయి. కర్ణాటకలో బీజేపీకి ఈగతి పడుతుందని 2021లోనే ఓ స్వామీజీ జోస్యం చెప్పడంతో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైయ్యింది.

కర్ణాటకలోని శిరహట్టి ఫక్కీరేశ్వర మఠం మఠాధిపతి దింగాలేశ్వర స్వామీజీ 2021లో మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కర్ణాటకలో బీజేపీకి దిక్కులేని పరిస్థితి ఎదురౌతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని జోస్యం చెప్పారు. ఆరోజు దింగాలేశ్వర స్వామిజీ బీజేపీకి ఎలా శాపనార్తాలు పెట్టారో ఇప్పుడు అదే అక్షరాలా నిజయం అయ్యిందని బీజేపీ నాయకులే కొందరు అంటున్నారు.

Bengaluru: Dingaleswara Swamiji had predicted two years ago that the BJP would lose in Karnataka.

ఆరోజు దింగాలేశ్వర స్వామీజీ చెప్పిన జోస్యం నిజయం అయ్యింది. హుబ్బళి తాలుకాలోని నూల్వి క్రాస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దింగాలేశ్వర స్వామీజీ మాట్లాడారు. ఎవరి స్వార్థం కోసం యడియూరప్పను బలవంతంగా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందకు దించేశారో అందరికి తెలుసని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు.

ఆరోజు యడియూరప్ప కన్నీరు పెట్టుకుని సీఎం కుర్చీ నుంచి కిందకు దిగిపోయారని, యడియూరప్ప కన్నీటిలోనే బీజేపీ ఈ రోజు కొట్టుకుపోయిందని, యడియూరప్ప ఉసురు బీజేపీకి తగిలిందని దింగాలేశ్వర స్వామీజీ మండిపడ్డారు. యడియూరప్ప అన్ని వర్గాలు, అన్ని కులాలకు చెందిన నాయకుడు అని, ఆయన లింగాయత్ లకు మాత్రమే నాయకుడు కాదని దింగాలేశ్వర స్వామిజీ అన్నారు.

Bengaluru: Dingaleswara Swamiji had predicted two years ago that the BJP would lose in Karnataka.

బీజేపీలో కొందరు నాయకుల పెత్తనం, ఓవర్ యాక్షన్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆపార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు. ఆరోజు బీజేపీలోని కొందరు పెద్దలు పర్సంటేజ్ లకు ఆశపడి చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాను ఆరోపిస్తే బీజేపీలోని కొందరు పెద్దలు స్వామీజీలను నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు తిట్టారని, ఆరోజు స్వామీజీలు అందరూ పెట్టిన శాపనార్తాలకు ఈ రోజు బీజేపీకి తగిన శాస్తి జరిగిందని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు.

బీజేపీలోని కొందరు నాయకులు ఆ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి బీఎస్. యడియూరప్ప, జగదీష్ శెట్టర్, లక్ష్మణ సవది, కేఎస్. ఈశ్వరప్ప లాంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టేసిందని, ఈ రోజు అందుకు ఫలితం అనుభవిస్తున్నారని, కర్ణాటకలో బీజేపీ కథ అయిపోయిందని దింగాలేశ్వర స్వామీజీ మండిపడ్డారు.

Bengaluru: Dingaleswara Swamiji had predicted two years ago that the BJP would lose in Karnataka.

దక్షిణ భారతదేశంలోని బీజేపీ నాయకులు గెలుపు గుర్రాలు అని ముందు అనుకున్న బీజేపీ హైకమాండ్ తరువాత వారిని చాలా చులకనగా, నీఛంగా చూడటం మొదలుపెట్టారని, అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని దింగాలేశ్వర స్వామీజీ ఆరోపించారు. బ్రాహ్మణుల గురించి ఆరు నెలల తరువాత తాను మీడియాతో మాట్లాడుతానని, బ్రాహ్మణుల గురించి మాట్లాడటానికి తనకు ఎలాంటి భయం లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలు బయటపెట్టి ఆరోజు తాను మాట్లాడుతానని దింగాలేశ్వర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని 2021లోనే దింగాలేశ్వర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దింగాలేశ్వర స్వామీజీ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజయం అయ్యాయని నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+