బెంగళూరు టూర్.. కేవలం రూ. 180 కే.. క్యూ కడుతున్న టూరిస్టులు..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. బెంగళూరులోని ప్రముఖ పర్యటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్, బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, బెంగళూరు ప్యాలెస్ వంటి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అలాగే బెంగళూరుకు సమీపంలో ఉన్న నంది హిల్స్ కూడా ప్రాధాన్యతను చాటుకుంది. వీటితో పాటు మైసూరు ప్యాలెస్, చాముండి హిల్స్, మైసూరు జూ, సెయింట్ ఫిలోమినాస్ చర్చి, జలపాతాలు, బృందావన్ గార్డెన్స్ తదితర పర్యటక ప్రాంతాలను ఒక్క రోజులో కవర్ చేసే అవకాశం ఉంది. అయితే టూరిస్టుల కోసం కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం రూ. 180 కే బెంగళూరు లోకల్ టూర్ ను అందిస్తోంది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే బెంగళూరు సిటీ టూర్ మొత్తం ఒక్క రోజులో పూర్తి చేయవచ్చు. ఈ టూర్ కోసం కర్ణాటక ప్రభుత్వం కొత్తగా బెంగళూరులో అంబారీ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ప్రారంభించింది. కర్ణాటక టూరిజం శాఖ ఆధ్వర్యంలో 40 సీట్లు, ఆడియో గైడ్, పర్యాటక ప్రదేశాలు, రూ.180 టికెట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ అంబారీ టూరిస్టు బస్సు నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూసేందుకు, బస్సులో ఎక్కి, ఇష్టమైన చోట దిగి తిరిగి ఎక్కి ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు.
కర్ణాటకలోని బెంగళూరులో తొలిసారిగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కర్ణాటక టూరిజం శాఖ. త్వరలోనే కర్ణాటకలోని ఇతర ప్రముఖ పర్యటక ప్రాంతాలకూ ఈ అంబారీ బస్సు సేవలను విస్తరించాలని భావిస్తోంది కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక ఈ అంబారీ బస్సు వివరాలు చూస్తే.. ప్రతి బస్సులో 40 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. పూర్తిగా ఎయిర్ కండిషన్ ఉన్న లోయర్ డెక్కర్ లో 20 సీట్లు, ఓపెన్- టాప్ అప్పర్ డెక్కర్ లో 20 సీట్లు ఉంటాయి.

ఇక అంబారీ బస్సు ప్రతి స్టాప్ కు చేరుకునే సమయంలో ఆ ప్రదేశం గురించి వివరణ ఇచ్చేందుకు బస్సులో ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. ఇది అన్ని భాషల్లో సంబంధిత పర్యటక ప్రదేశం గురించి వివరిస్తుంది. ఇక కర్ణాటక టూరిజం డిపార్ట్ మెంట్ ప్రవేశపెట్టిన ఈ బస్సు టికెట్ కేవలం రూ. 180 మాత్రమే.. టికెట్ లు KSTDC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 10:30 నుంచి రాత్రి 8:00 వరకు ఉంటాయి. ఇక ట్రిప్స్ మొత్తం ఐదు రూట్లలో ఉంటాయి. మొత్తం 26 పర్యాటక ప్రదేశాలను ఈ బస్సు కవర్ చేస్తుంది. ఈ బస్సు సర్వీసులపై టూరిస్టుల నుంచి విశేష స్పందన వచ్చింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications