బెంగళూరులో రేపు హాఫ్ డే లీవ్

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అటు నూతన మంత్రివర్గ కూర్పు కూడా తుది దశకు చేరుకుంది. హైకమాండ్ నేతల సమక్షంలో ఈ సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. రాత్రి నాటికి మంత్రుల తుది జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికార నివాసంలో ఈ 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమావేశం అయ్యారు.

ఈ సాయంత్రం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ భేటీ కానున్నారు. పాతతరం - కొత్త చిగురు' అనే ఫార్ములాను అనుసరించనుంది హైకమాండ్. అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులతో పాటు యువ, నూతన ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు మంత్రివర్గంలో. దాదాపు 8 నుండి 10 మంది కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కవచ్చని అంచనా.

Bengaluru Government Offices to Close Half Day for DK Shivakumar s Swearing-In as Karnataka CM

హైకమాండ్ రెండు దశల్లో కేబినెట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి దశలో 8 నుండి 12 మంది ప్రముఖ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల అనంతరం, మిగిలిన స్థానాలను భర్తీ చేస్తూ రెండో దశ విస్తరణ చేయాలని అధిష్టానం యోచిస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్ నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేస్ కోర్స్ రోడ్డులోని కాంగ్రెస్ భవనాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించాలని నిర్ణయించారు.

డీకే శివకుమార్ రేస్ కోర్స్ రోడ్డులోని కాంగ్రెస్ భవన్ స్థలాన్ని సందర్శించి, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలను నిర్మించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని, వాటికి మరో రోజు శంకుస్థాపన జరుగుతుందని డీకే శివకుమార్ తెలియజేశారు. భూమి పూజ కార్యక్రమానికి కేవలం నాలుగు వీఐపీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, మిగిలిన వాహనాలకు అనుమతి నిరాకరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.

కాగా ఆయా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సాయంత్రం 4:05 నిమిషాలకు లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం వల్ల లోక్‌భవన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉంది. దీనివల్ల భారీ ట్రాఫిక్ రద్దీ, భద్రతా సమస్యలు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ పరిస్థితులను నివారించడానికి జూన్ 3 మధ్యాహ్నం విధాన సౌధ, వికాస సౌధ పరిసర ప్రాంతాలల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ కూడా హాఫ్ డే సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ కార్యాలయాలేవీ పని చేయవు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.

దీనివల్ల ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. ప్రమాణ స్వీకార సమయం నాటికి ఉద్యోగులందరూ ఇంటికి చేరుకునే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తబోవని భావిస్తోంది. దీనిపై ప్రభుత్వ అండర్ సెక్రటరీ (సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ) ఆర్ యదుకుమార్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+